Charminar Express Train : నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్.. 50 మందిపైగా గాయాలు..!
Charminar Express Train : ఇవాళ నాంపల్లి రైల్వే స్టేషన్లో nampally railway station చార్మినార్ ఎక్స్ ప్రెస్ Charminar Express Traind కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ఫ్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను రైలు Train ఢీకొట్టింది accident . ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో రైలు డెడ్ ఎండ్ కి వచ్చిన తర్వాతే ఈ ప్రమాదం జరిగిందని సీపీఆర్ఓ రాకేష్ తెలిపారు. డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతోనే రైలు పట్టాలు తప్పిందని ఆయన అన్నారు. చాలామంది ప్రయాణికులు సికింద్రాబాద్ లోనే దిగిపోయారు. తక్కువ మంది ప్రయాణికులు నాంపల్లికి వచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురు ప్యాసింజర్లకు గాయాలు అయ్యాయి. వారిని లాలాగూడ రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీలైనంత త్వరగా రైలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రైలు తొలగించిన అనంతరం పట్టాలు దెబ్బతిన్న విషయం తెలుస్తుంది. ఈ ప్రమాదం వలన నాంపల్లికి వచ్చే కొన్ని రైళ్లను రద్దు చేసే అవకాశం ఉందని సీపీఆర్ఓ రాకేష్ తెలిపారు. రైలు చెన్నై నుంచి హైదరాబాదుకు చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. స్టేషన్ కు నెమ్మదిగా వస్తుండడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, కొందరు స్వల్పంగా గాయపడ్డారని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. పట్టాలు కొద్దిగా పక్కకి జరగడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు.
జిల్లా యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టాలని, గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చెన్నై నుంచి నాంపల్లి కి వస్తున్న రైలుకి చిన్న ప్రమాదం జరిగింది. రైలు నెమ్మదిగా వస్తుండటంతో ఈ ప్రమాదం తప్పింది. అదే వేగంగా రైలు వస్తే పరిస్థితి వేరేలా ఉండేది అని అక్కడి స్థానికులు అంటున్నారు. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడం వలన మూడు భోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులు కూడా తక్కువ మంది ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఆరుగురు ప్రయాణికులకు మాత్రం గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక యాంకర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత నటిగా మారింది. ఒక మనస్సు,…
Air India Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం…
CM Revanth Reddy : హైదరాబాద్ Hyderabad నగరంలో మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ…
Air India Flight : థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి (AI-379) శుక్రవారం బాంబు…
Bhagwat Geeta : తాజాగా జరిగిన ప్రమాదం లో అన్నీ కాలి బూడిద అవ్వడం చూశాం. ఈ ప్రమాదంలో మనుషులు…
S Name Astrology : సంఖ్యాయ శాస్త్రంలో ప్రతి ఒక అక్షరానికి ప్రత్యేక శక్తి, లక్షణాలు ఉంటాయి. మొదటి అక్షరం…
Ahmedabad Plane Crash : ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ 11 సంవత్సరాల పురాతన విమానం కాగా, అహ్మదాబాద్…
Today Gold Price : ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల…
This website uses cookies.