CM KCR : తెలంగాణలో బీజేపీ మెల్ల మెల్లగా చాప కింద నీరు మాదిరిగా పెరిగి పోతుంది. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలం అవుతున్నారు. పార్టీలో కొందరు మినహా ఎక్కువ శాతం మంది బీజేపీ పై విమర్శలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కొందరు భయంతో కూడా వ్యాఖ్యలు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా ఎక్కడ తమ అవినీతిని బయట పెట్టే విధంగా ఐటీ రైట్స్ ను చేస్తారేమో అనే భయంతో కొందరు నోరు మెదపడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. పలువురు మంత్రులు ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేక మౌనంగా ఉంటున్నారు. పార్టీకి నష్టం జరుగుతున్నా నోరు విప్పని మంత్రులకు ఉద్వాసన పలికేందుకు గాను కేసీఆర్ సంచలన నిర్ణయానికి సిద్దం అవుతున్నారు.
కేసీఆర్ ప్రస్తుత క్యాబినేట్ నుండి అయిదు నుండి ఎనిమిది మందిని తొలగించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున జరుగబోతున్న ఈ మార్పుతో తెలంగాణ రాజకీయం పూర్తిగా మారబోతుందని అంటున్నారు. తెలంగాణలో బీజేపీ బలంను ఆదిలోనే తుంచి పారేసేందుకు కేసీఆర్ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే మంత్రి వర్గ కూర్పును ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులుగా ఉన్న వారు బీజేపీ పై వ్యాఖ్యలు చేయడం వల్ల మీడియాలో కవరేజ్ ఎక్కువగా వస్తుంది. తద్వారా బీజేపీ కి నష్టం తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే బీజేపీని ఏకి పారేసే ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు.
కాంగ్రెస్ నుండి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరియు ప్రస్తుతం ఎమ్మెల్సీ బరిలో ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి కూడా కొత్త గా మంత్రి పదవులు చేపట్టబోతున్న వారిలో ఉన్నారు. ఇక తన కూతురు కవిత కు కూడా ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి కట్టబెట్టేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎమ్మెల్సీ ఫలితాల ఆధారంగా కూడా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. ఏ మంత్రి అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిగా ప్రభావం చూపించలేక పోయారో వారు కూడా ఉద్వాసనకు గురి కాక తప్పదు అన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుందో తెలియాలంటే మరో వారం పది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.