MP Arvind : రాజకీయాలను నాశనం చేసిన కేసీఆర్ కుటుంబం : ఎంపీ అరవింద్
ప్రధానాంశాలు:
MP Arvind : రాజకీయాలను నాశనం చేసిన కేసీఆర్ కుటుంబం : ఎంపీ అరవింద్
MP Arvind : మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ Brs party అధినేత కేసీఆర్ KCR రాష్ట్ర రాజకీయాలను నాశనం చేసిండని ఎంపీ ధర్మపురి అర్వింద్ MP Dharmapuri Arvind అన్నారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ విలువలను కేసీఆర్ కుటుంబం పాతాళానికి తొక్కేసిందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ TDP, కాంగ్రెస్ Congress, బీజేపీ BJP, వామపక్షాలు, ఇతర పార్టీలు ప్రజా క్షేత్రంలో ఉన్నప్పటికీ పరస్పరం విమర్శలు చేసుకున్నారన్నారు.

MP Arvind : రాజకీయాలను నాశనం చేసిన కేసీఆర్ కుటుంబం : ఎంపీ అరవింద్
కానీ, బీఆర్ఎస్ పార్టీ BRS ఆవిర్భవించాక రాజకీయాల్లో ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతల భౌతిక దాడులు ఎక్కువైనట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ప్రతిపక్ష నేతలపై దాడులు, అక్రమ కేసులు బనాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
MP Arvind నెత్తి మీద టోపీ పెట్టుకునే వాళ్లు తప్పా
ప్రభుత్వం పథకాల అమలులో గులాబీ పార్టీ విపరీతమైన అవినీతికి పాల్పడిందన్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి రెండోసారి బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. స్వరాష్ట్ర సాధనకు అందరితో పాటే కేసీఆర్ కూడా పోరాడినట్లు చెప్పారు. 2014 వరకు ఆయనపై గౌరవం ఉండేదని, ఎప్పుడైతే అధికారం చేతికొచ్చిందో అప్పటినుంచే ఆ మనిషి మారిపోయాడన్నారు. రాజకీయాలను, వ్యవస్థలను ఆయన పూర్తిగా భ్రష్టు పట్టించినట్లు దుయ్యబట్టారు. నెత్తి మీద టోపీ పెట్టుకునే వాళ్లు తప్పా, ప్రజలెవరూ మళ్లీ బీఆర్ఎస్ పాలనను కోరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ రాజకీయాలను మొత్తం నాశనం చేశారు : అరవింద్
నాటి రాజకీయాలకు, నేటి రాజకీయాలకు చాలా తేడా ఉంది
ఒకప్పటి రాజకీయాల్లో ప్రతిపక్షాల పై అక్రమ కేసులు, దాడులు, ఇంత అవినీతి ఉండేది కాదు
నెత్తి మీద టోపీ పెట్టుకునే వాళ్లు తప్ప ప్రజలేవరూ మళ్లీ
బీఆర్ఎస్ ను కోరుకోవడం లేదు2014 వరకు… pic.twitter.com/BEaAIWF822
— BIG TV Breaking News (@bigtvtelugu) February 20, 2025