
Revanth Reddy : ఎవడు ఎవరికి గురువు అంటూ చంద్రబాబుపై రేవంత్ రెడ్డి అలా కామెంట్ చేశాడేంటి..?
Revanth Reddy : మే 13న ఎన్నికలు జరగనుండగా, మరి కొద్ది రోజులలో ప్రచారానికి పులిస్టాప్ పడనుంది. మరో నాలుగు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండగా వీటిపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ఇక ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుపై సంచలనవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో శిష్యుడు కోసం గురువు టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికలలో పోటీచేయకుండా నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు శిష్యుడు గురువు కోసం ఏమైనా సహాయం చేసే అవకాశం ఉందా అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురు కాగా, దానికి రేవంత్ రెడ్డి షాకింగ్ సమాధానం చెప్పాడు.
రేవంత్ రెడ్డి స్పందిస్తూ… ‘ఎవడయ్యా బుర్రలేనోడు మాట్లాడేది. శిష్యుడు ఎవరు..? గురువు ఎవరు..? నేను సహచరుడిని అని చెప్పిన. ఎవడన్న బుద్దిలేని గాడిద కొడుకు గురువు, శిష్యుడు అని మాట్లాడితే.. ముడ్డి మీద పెట్టి తంతా.. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. నేను ఎఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి ఆ పార్టీలోకి పోయాను. నేను సహచరుడిని’ అని సమాధానం చెప్పారు. తాను ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్లానని, తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు కాబట్టి పార్టీ అధినేతగా ఆయనకు నేను అపారమైన గౌరవాన్ని ఇస్తానని పేర్కొన్నారు. ఏపీలో చంద్రబాబుకి మీరు సహకారం అందిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీలో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఉన్నారని, ఆమెను ముఖ్యమంత్రిని చేయాలని వైజాగ్ వెళ్లి ప్రచారం చేసి వచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Revanth Reddy : ఎవడు ఎవరికి గురువు అంటూ చంద్రబాబుపై రేవంత్ రెడ్డి అలా కామెంట్ చేశాడేంటి..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షర్మిల ను కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ నిర్ణయిస్తే ముఖ్యమంత్రి చేయడానికి నేను పనిచేస్తానన్నారు. వేరే పార్టీల కోసం పని చేయాల్సిన అవసరం తనకు లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పదేపదే రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకటేనని, రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు, చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసిపి నేతలు. దీనికి రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం అందరికి ఓ క్లారిటీ వచ్చేలా చేసింది.
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
This website uses cookies.