Vivekananda Case : జగన్ కి బిగ్ షాక్ .. వివేకా కేసులో సుప్రీం కోర్టు లో సంచలనం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vivekananda Case : జగన్ కి బిగ్ షాక్ .. వివేకా కేసులో సుప్రీం కోర్టు లో సంచలనం

 Authored By sudheer | The Telugu News | Updated on :6 February 2026,1:40 pm

ప్రధానాంశాలు:

  •  Vivekananda Case : జగన్ కి బిగ్ షాక్ .. వివేకా కేసులో సుప్రీం కోర్టు లో సంచలనం

Vivekananda Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు వెలువరించిన తాజా ఆదేశాలు ఏపీ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి సుప్రీంకోర్టు సీబీఐకి CBI కీలక దిశానిర్దేశం చేసింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం, దర్యాప్తు సంస్థ సీబీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్యాప్తును వేగవంతంగా కొనసాగించాలని కోర్టు పేర్కొంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తెలిపినప్పటికీ, అవసరమైతే మరికొందరిని విచారించేందుకు, తదుపరి ఆధారాలను సేకరించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, దర్యాప్తును నెల రోజుల్లోపే ముగించాలన్న ట్రయల్ కోర్టు గడువును సవరించి, “వీలైనంత త్వరగా”  Expeditiously  పూర్తి చేయాలని ఆదేశించింది.

Vivekananda Case జగన్ కి బిగ్ షాక్ వివేకా కేసులో సుప్రీం కోర్టు లో సంచలనం

Vivekananda Case : జగన్ కి బిగ్ షాక్ .. వివేకా కేసులో సుప్రీం కోర్టు లో సంచలనం

సిబిఐ కి సుప్రీం కీలక ఆదేశాలు

న్యాయస్థానం ఈ విచారణ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తాము ఇప్పుడే ‘మినీ ట్రయల్’ నిర్వహించలేమని, ఒకవేళ అలా చేస్తే విచారణ మరో మూడు నాలుగేళ్ల పాటు సాగిపోయే ప్రమాదం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే, దర్యాప్తు సంస్థ నిబంధనలకు లోబడి కఠినంగా వ్యవహరించాలని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రక్రియను ముగించాలని సీబీఐని ఆదేశించింది. విచారణా సమయంలో ఎవరినైనా పిలిచి ప్రశ్నించే అధికారం సీబీఐకి ఉందని, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను యథాతథంగా అమలు చేస్తూ ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇది దర్యాప్తు సంస్థకు మరింత వెసులుబాటును, బాధ్యతను కల్పించినట్లయింది.

తుది దశకు చేరుకున్న కేసు

ఈ పరిణామం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YCP) పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విచారణలో సిద్ధార్థ లూథ్రా వంటి సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తుండటం, కోర్టు దర్యాప్తును వేగవంతం చేయాలని చెప్పడం కేసు తుది దశకు చేరుకుంటుందనే సంకేతాలను ఇస్తోంది. దర్యాప్తు సంస్థ ఎవరిని విచారణకు పిలుస్తుంది? రాబోయే రోజుల్లో ఎలాంటి ఆధారాలు బయటకు వస్తాయి? అనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ తన తదుపరి అడుగులు ఎలా వేయబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది