Guppedantha Manasu 2 Sep Today Episode : వసు చివరి పరీక్ష రాస్తుందా? తన లక్ష్యం నెరవేరుతుందా? దేవయాని, సాక్షి ప్లాన్ సక్సెస్ అవుతుందా? రిషి ఏం చేస్తాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 2 Sep Today Episode : వసు చివరి పరీక్ష రాస్తుందా? తన లక్ష్యం నెరవేరుతుందా? దేవయాని, సాక్షి ప్లాన్ సక్సెస్ అవుతుందా? రిషి ఏం చేస్తాడు?

Guppedantha Manasu 2 Sep Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 సెప్టెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 545 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి, గౌతమ్ కాలేజీకి వస్తారు. ఆ తర్వాత మహీంద్రా, జగతి కూడా కాలేజీకి వస్తాడు. అంతటా వెతుకుతారు కానీ.. ఎక్కడా వసుధర కనిపించదు. నేను రాత్రి గెస్ట్ హౌస్ లోనే ఉంటాను. మీరు వెళ్లండి అంటాడు రిషి. దీంతో మహీంద్రా, జగతి, […]

 Authored By gatla | The Telugu News | Updated on :2 September 2022,9:30 am

Guppedantha Manasu 2 Sep Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 సెప్టెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 545 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి, గౌతమ్ కాలేజీకి వస్తారు. ఆ తర్వాత మహీంద్రా, జగతి కూడా కాలేజీకి వస్తాడు. అంతటా వెతుకుతారు కానీ.. ఎక్కడా వసుధర కనిపించదు. నేను రాత్రి గెస్ట్ హౌస్ లోనే ఉంటాను. మీరు వెళ్లండి అంటాడు రిషి. దీంతో మహీంద్రా, జగతి, గౌతమ్ ఇంటికి వెళ్లిపోతారు. గెస్ట్ హౌస్ కు వెళ్లిన తర్వాత రిషి.. వసు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైందో తెలియక పిచ్చెక్కుతుంది. మళ్లీ ఫోన్ చేస్తాడు. అయినా స్విచ్ ఆఫ్ వస్తుంది. వసుధరకు ఏమైంది. రేపు ఎగ్జామ్ ఉంది కదా.. ఎక్కడికి వెళ్లావు వసుధర అని అనుకుంటాడు. అక్కడే సోఫా మీద పడుకుంటాడు రిషి. లేచి చూసేసరికి ఉదయం అవుతుంది. 8.30 అవుతుంది. ఎగ్జామ్ టైమ్ అవుతోంది. వసుధర ఎక్కడ ఉంది అని టెన్షన్ పడుతుంటాడు రిషి. ఫోన్ చేస్తాడు కానీ.. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈరోజు వసుధర ఎగ్జామ్ రాయకపోతే తను అనుకున్న గోల్ ఏం కావాలి. వసుధర ఎక్కడికి వెళ్లావు అని అనుకుంటాడు రిషి.

guppedantha manasu 2 september 2022 full episode

guppedantha manasu 2 september 2022 full episode

ఇంతలో మహీంద్రా, జగతి వస్తారు. వసుధర గురించి ఏమన్నా తెలిసిందా అని అడుగుతాడు. దీంతో తెలియలేదు అంటారు. వసుధర ఎక్కడికి వెళ్లిందో మీకైనా తెలిసిందా మేడమ్ అని అడుగుతాడు. మేమందరం వసు ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి అడిగాం. ఎవ్వరూ తెలియదు అని చెబుతున్నారు అంటుంది జగతి. ఇంతలో పుష్ప వస్తుంది. తనకు కూడా తెలియదు అంటుంది. రిషి టెన్షన్ పడుతుంటే ఎగ్జామ్ కు టైమ్ అవుతోంది. ఆ ఏర్పాట్లు చూడాలి అని అంటాడు మహీంద్రా. దీంతో మీరు వెళ్లండి అంటాడు రిషి. తర్వాత కాలేజీ లోపలికి వెళ్తాడు రిషి. నాకోసం అయినా కనిపించు వసుధర అని అనుకుంటాడు. ఏం చేయాలో తనకు తెలియదు. గుడ్ మార్నింగ్ సార్.. మీరు జెంటిల్ మెన్ సార్ అంటూ వసుధర తనను అంటున్నట్టుగా కలగంటాడు రిషి.

ఇంతలో తనకు వసుధర బ్యాగు నుంచి కింద పడ్డ గోలీలు కనిపిస్తాయి. వాటిని చూస్తూ వెళ్తాడు రిషి. వసుధర దాచుకున్న గోలీలే కదా ఇవి అనుకొని వాటిని చూస్తాడు. అక్కడ ఉన్న రూమ్స్ లో చెక్ చేస్తాడు. కానీ.. వసుధర కనిపించదు. మరో రూమ్ కు వెళ్తాడు. అక్కడ తన కాళ్లు కనిపిస్తాయి. అక్కడికి వెళ్లి చూసి షాక్ అవుతాడు. వసుధర కింద పడిపోయి ఉండటం చూసి వసుధర నీకు ఏమైంది అని అడుగుతాడు.

Guppedantha Manasu 2 Sep Today Episode : వసుధరను లేపేందుకు ప్రయత్నించిన రిషి

వసుధర లే అని ఎంత చెప్పినా వసుధర లేవదు. ఇంతలో గౌతమ్ వస్తాడు. తను ఇక్కడ పడిపోయింది. వెంటనే డాక్టర్ ను తీసుకురా అంటాడు రిషి. వసుధరను లేపి అక్కడి నుంచి తీసుకెళ్తాడు రిషి. తన రూమ్ లో సోఫా మీద కూర్చోబెడతాడు. నీళ్లు కొట్టినా కూడా వసుధర లేవదు.

దీంతో రిషికి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నీకు ఎగ్జామ్ ఉంది. ఇది నువ్వు రాసి తీరాలి వసుధర అంటాడు రిషి. నీళ్లు తాగు వసుధర అంటాడు. కానీ.. వసుధర లేవదు. నువ్వు ఎగ్జామ్ రాయాలి. నీకు లక్ష్యం ఉంది. నువ్వు యూనివర్సిటీ టాపర్ అవ్వాలి అంటాడు.

మరోవైపు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. జగతి ప్రశ్నాపత్రాలు తీసుకెళ్తుంది. తనకు ఏమైంది అని అనుకుంటుంది. ప్రశ్నాపత్రాలు ఇచ్చేశాక.. పరీక్ష స్టార్ట్ కాగానే మేడమ్ ప్రశ్నాపత్రం అంటూ వచ్చి అడుగుతుంది వసుధర. దీంతో జగతి సంతోషిస్తుంది. సరే సరే ముందు ఎగ్జామ్ రాయి. తర్వాత మాట్లాడుదాం అంటుంది జగతి.

పరీక్ష రాయడానికి వసు ప్రయత్నిస్తుంది కానీ.. పరీక్ష రాయలేకపోతుంది. తన కళ్లు బైర్లు కమ్ముతాయి. నేను పరీక్ష రాయాలి.. నేను రాస్తాను అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది