Intinti Gruhalakshmi 11 Oct Today Episode : దాండియా కాంపిటిషన్ లో గెలిచిన సామ్రాట్, తులసి జంట.. అనసూయకు కోపం వచ్చి ఏం చేస్తుంది?
Intinti Gruhalakshmi 11 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 760 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఘనంగా బతుకమ్మ సంబురాలను చేసుకుంటూ ఉంటారు తులసి ఫ్యామిలీ. మరోవైపు హనీకి ఏమైందో అనుకొని భయపడుతూ కారులో వస్తుంటాడు సామ్రాట్. కాంపిటిషన్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ గెలవలేదు. ఇక చివరి జంట ప్రేమ్, శృతి అంటుంది యాంకర్. మీరు తప్పకుండా గెలుస్తారు అంటుంది తులసి. ఇద్దరూ వెళ్తారు. ప్రేమ్.. చిట్టీ తీస్తాడు. అందులో మనసంతా నువ్వే సినిమా పేరు ఉంటుంది. దాన్ని ఎలా చెప్పాలా అని అనుకుంటాడు ప్రేమ్. ప్రేమ్ యాక్షన్ కు వెంటనే మనసంతా నువ్వే అని చెప్పేస్తుంది శృతి.

intinti gruhalakshmi 11 october 2022 full episode
ఇద్దరూ మనసుతోనే కాసేపు అక్కడే మాట్లాడుకుంటారు. ఈ కాంపిటిషన్ లో గెలిచినందుకు ప్రేమ్, శృతిని అన్యోన్య దంపతులుగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఇంకో గేమ్ స్టార్ట్ చేద్దామంటుంది యాంకర్. పరందామయ్య వెళ్లి అనసూయ గురించి చెబుతాడు. ఆ తర్వాత మళ్లీ ప్రేమ్, శృతిని పిలుస్తారు. వాళ్లతో బాల్ గేమ్ ఆడిస్తారు. కానీ.. బాల్ గేమ్ లో ప్రేమ్, శృతి గెలవరు. తర్వాత నందు, లాస్య ఇద్దరూ లేస్తారు. వాళ్లు కూడా బాల్ గేమ్ లో గెలవరు.
తర్వాత ఇంకెవరు మిగిలారు అని అడుగుతుంది యాంకర్. తులసి.. అభి, అంకితను ఆడమని చెబుతుంది. దీంతో బాల్ గేమ్ లో అభి వాళ్లు గెలుస్తారు. మరోవైపు సామ్రాట్, బాబాయి వస్తారు. వాళ్లు హనీ దగ్గరికి వెళ్తారు.
Intinti Gruhalakshmi 11 Oct Today Episode : హనీ దగ్గరికి వచ్చిన సామ్రాట్ కు షాక్
వాళ్లను చూసి సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది తులసి. హనీ కడుపు నొప్పి తగ్గిందా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో కడుపునొప్పా.. మాకు తెలియదే అని అంటుంది తులసి. అదేంటి తులసి గారు మీకు అంత నిర్లక్ష్యమా అంటాడు.
పాప కడుపు నొప్పి అని బాధపడుతుంటే మీరు పట్టించుకోరా అంటాడు సామ్రాట్. అసలు హనీకి కడుపులో నొప్పి అని నాకు తెలియదు అని అంటుంది తులసి. హనీ చెప్పలేదు అంటుంది తులసి.
దీంతో అసలు నాకు కడుపులో నొప్పి వస్తే కదా. మా నాన్నకు ఫోన్ చేసి అబద్ధం చెప్పా అంటుంది హనీ. దీంతో సామ్రాట్ కు కోపం వస్తుంది. మా నాన్న కూడా పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని పిలిచాను అంటుంది హనీ.
ఆ తర్వాత దాండియా కాంపిటిషన్ స్టార్ట్ అవుతుంది. దీంతో సామ్రాట్ కూడా వచ్చి తులసితో కలిసి దాండియా ఆడుతాడు. సామ్రాట్, తులసి జంట బాగా దాండియా చేయడంతో ఇద్దరూ కాంపిటిషన్ లో గెలుస్తారు.
అది చూసి అనసూయకు నచ్చదు. కాలనీ వాళ్లు అందరూ వాళ్లను విచిత్రంగా చూస్తుంటారు. కాలనీ వాళ్లు పలు రకాలుగా తులసి గురించి అనుకుంటూ ఉంటారు. వాళ్ల మాటలను విని అనసూయకు కోపం వస్తుంది.
వీళ్లు ఏంటి ఇలా ఊళ్ల మీద పడి పోట్ల గిత్తలా తిరుగుతున్నారు అంటారు అక్కడికి వచ్చిన వాళ్లు. దీంతో తులసి, సామ్రాట్ కు కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.