Janhvi Kapoor : ‘ వాడు వస్తే ఇప్పుడే తాళి కట్టించుకుంటా ‘ జాన్వీ కపూర్ సీరియస్ కామెంట్స్ !
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వి కపూర్. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే సినిమాలు చేసిన ఈ బ్యూటీ త్వరలోనే ఎన్టీఆర్ 30 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తి విషయాలను చెప్పుకొచ్చింది. జాన్వి కపూర్ తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ఒక ప్రాంతంలో ఉండిపోకుండా అలా ప్రపంచాన్ని చుట్టేసి రావాలని, […]
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వి కపూర్. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే సినిమాలు చేసిన ఈ బ్యూటీ త్వరలోనే ఎన్టీఆర్ 30 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తి విషయాలను చెప్పుకొచ్చింది. జాన్వి కపూర్ తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ఒక ప్రాంతంలో ఉండిపోకుండా అలా ప్రపంచాన్ని చుట్టేసి రావాలని, పుస్తకాలు రాయడం ఇష్టమని, కొత్త వ్యక్తులను కలుసుకోవాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
అలాగే తనకు ఇష్టమైన కార్ బెంజ్ అని, ఇష్టమైన టూరిజం ప్లేస్ ఒక్క మాల్దీవులు మాత్రమే అని చెప్పింది. ఏదైనా ఇబ్బంది వచ్చినా లేదా మనశ్శాంతి కోల్పోయిన అక్కడికే వెళ్తానని, ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పకుండా మాల్దీవులకు వెళ్లి వస్తానని చెప్పింది. ఇకపోతే కాబోయే వాడు ఎలా ఉండాలనే ప్రశ్నకు తను విభిన్నమైన సమాధానాలు ఇచ్చింది. తన ప్రొఫెషనల్ ను గౌరవించే వ్యక్తి తన జీవితంలోకి రావాలని జాన్వికపూర్ చెప్పుకొచ్చింది. అలాగే మంచి సెన్సాప్ హ్యూమర్ ఉండాలని,
తెలియని విషయాలను నేర్చుకుంటే ఏదో ఒకటి తనకు ఉత్సాహంగా నేర్పించే వ్యక్తి ఉండాలి అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. అంతేకాదు తన తండ్రి బోనీ కపూర్ కంటే ఎక్కువ హైట్ ఉండాలని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు భర్తగా రావాలని చెప్పుకొచ్చింది. మొత్తానికి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి అంటూ జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో ఎన్టీఆర్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో ఛాన్స్ లు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది.