Ram Charan : ‘ఆర్సీ 15’పై భారీ అంచనాలు.. పాటకే పాతిక కోట్లు.. గ్రాండియర్గా మూవీ..!
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ కరోనా మహమ్మారి వలన వాయిదా పడింది. కాగా, దేశంలో కరోనా పరిస్థితులు చక్కబడితే ఈ ఏడాది మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సంగతి అలా ఉంచితే.. రామ్ చరణ్ నెక్స్ట్ ఫిల్మ్ ‘ఆర్ సీ 15’పైన అప్పుడే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్నఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పుణేలో పూర్తి అయింది. కాగా, ప్రజెంట్ కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఇందులో సునీల్ కీలక పాత్ర పోషిస్తుండగా, బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఫిల్మ్లో ఓ సాంగ్ను శంకర్.. తనదైన స్టైల్లో హై టెక్నికల్ వాల్యూస్తో గ్రాండియర్గా తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు కాబోతున్నదని వార్తలొస్తున్నాయి.ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ram charan huge expectations on rc 15 movie for song only crores of money
Ram Charan : మేకింగ్లో తగ్గేదేలే అంటున్న శంకర్..
సోషల్ మెసేజ్తో ఈ సినిమా రూపొందుతుండగా, ఈ చిత్రం రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తుందని ప్రొడ్యూసర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుల కాబోతున్నది. ఇందులో హీరోయిన్ అంజలి కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తోంది. ‘ఇండియన్’ మాదిరి ఫిల్మ్ ఇది అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. జీనియస్ డైరెక్టర్ శంకర్తో ఎప్పటి నుంచో వర్క్ చేయాలని అనుకున్నారు. అది ఆయనకు సాధ్యపడలేదు. కానీ, ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్కు అయితే అవకాశం వచ్చింది. శంకర్ ఈ సినిమా ద్వారా తొలి సారి కోలీవుడ్ కాకుండా టాలీవుడ్కు చెందిన హీరోతో సినిమా చేస్తున్నారు.