Samantha : ఒక్క పూట భోజనంతో రెండు నెలలు.. తొలినాళ్ల విషయాలు గుర్తు చేసుకుంటూ సమంత ఎమోషనల్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : ఒక్క పూట భోజనంతో రెండు నెలలు.. తొలినాళ్ల విషయాలు గుర్తు చేసుకుంటూ సమంత ఎమోషనల్..

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత…ప్రస్తుతం తన ప్రొఫెషనల్ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా ఫిల్మ్స్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది ఈ భామ. ఇటీవల ఈ సుందరి స్పెషల్ సాంగ్ కూడా చేసింది. పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో ‘ఊ అంటావా మావా..’ సాంగ్ సమంత చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే సమంత.. తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :5 February 2022,10:00 pm

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత…ప్రస్తుతం తన ప్రొఫెషనల్ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా ఫిల్మ్స్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది ఈ భామ. ఇటీవల ఈ సుందరి స్పెషల్ సాంగ్ కూడా చేసింది. పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో ‘ఊ అంటావా మావా..’ సాంగ్ సమంత చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే సమంత.. తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. ఇందుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో

ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇటీవల కాలంలో సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా పోస్టుల రూపంలో తెలుపుతోంది. తన అమ్మ తనకు చెప్పిన విషయాలను సమంత ఇటీవల సోషల్ మీడియా పోస్టుల రూపంలో తెలిపింది నాగచైతన్య ఎక్స్ వైఫ్. తాజాగా తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలను గురించి చెప్పింది.ప్రస్తుతం వరుస సినిమాలతో తాను ఫుల్ బిజీగా ఉన్నానని, కానీ, కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టాలు అనుభవించానని అంది. సాధారణ అమ్మాయి ఇండస్ట్రీకి వస్తే ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డానని వివరించింది.

samantha emotional post in social media

samantha emotional post in social media

Samantha : అలా చేసినందుకుగాను రోజుకు రూ.500..

తాను అమ్మానాన్నల కోరిక మేరకు బాగా చదివి టాపర్ గా నిలిచానని, ఈ క్రమంలోనే తాను గ్లామర్ వరల్డ్ లోకి రావాలనుకున్నపుడు పేరెంట్స్ సపోర్ట్ చేశారని చెప్పింది. పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో తాను అక్కడకు హాజరయ్యే గెస్టులకు వెల్ కమ్ చెప్పే అమ్మాయిగా పని చేశానని చెప్పుకొచ్చింది సమంత. డబ్బులు లేక ఒక్క పూట భోజనంతో రెండు నెలలు గడిపిన విషయం చెప్తూ ఎమోషనల్ అయింది. ఫంక్షన్స్ లో గెస్టులకు వెల్ కమ్ చెప్పినందుకుగాను రోజుకు రూ.500 ఇచ్చే వారని గుర్తు చేసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇప్పుడీ పొజిషన్ కు వచ్చినట్లు సమంత తెలిపింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది