Sarath Babu : శరత్ బాబు చనిపోయాడు అని ప్రచారం చేస్తోంది వాళ్ళే .. కావాలనే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sarath Babu : శరత్ బాబు చనిపోయాడు అని ప్రచారం చేస్తోంది వాళ్ళే .. కావాలనే !

Sarath Babu : ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్యంపై కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల రావడం వైరల్ కావడం తెలిసిందే. బుధవారం మే మూడవ తారీకు సాయంత్రం ఆయన ఏకంగా చనిపోయినట్లు.. కొన్ని వెబ్ మీడియా… లలో స్టోరీలు వచ్చాయి వెంటనే శరత్ బాబు సోదరి వాటిలో వాస్తవం లేదని క్లారిటీ ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని త్వరలో మీడియాతో మాట్లాడగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి […]

 Authored By sekhar | The Telugu News | Updated on :4 May 2023,1:00 pm

Sarath Babu : ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్యంపై కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల రావడం వైరల్ కావడం తెలిసిందే. బుధవారం మే మూడవ తారీకు సాయంత్రం ఆయన ఏకంగా చనిపోయినట్లు.. కొన్ని వెబ్ మీడియా… లలో స్టోరీలు వచ్చాయి వెంటనే శరత్ బాబు సోదరి వాటిలో వాస్తవం లేదని క్లారిటీ ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని త్వరలో మీడియాతో మాట్లాడగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను నమ్మవద్దని ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతునికి ప్రార్థించాలని ప్రజలను కోరడం జరిగింది.

71 సంవత్సరాల వయసున్న శరత్ బాబు హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. రైతులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఊపిరితిత్తులు మరికొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో ఓ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందిన శరత్ బాబు.. పరిస్థితి విషమించడంతో అక్కడినుండి హైదరాబాద్ తరలించడం జరిగింది.

Sarath Babu

Sarath Babu

ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ క్రమంలో శరత్ బాబు ఆరోగ్యంపై రకరకాల ఫేక్ వార్తలు సృష్టించి వ్యూస్ కోసం పలు వెబ్ మీడియా చానల్స్… ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న.. తరుణంలో శరత్ బాబు సోదరి వచ్చి క్లారిటీ ఇవ్వటంతో ఆయన చనిపోయినట్లు వచ్చిన వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది