Aloo Bukhara : ఆల్ బుకరా పండు లోని ఉన్న ఔషధాలు తెలిస్తే ఆశ్చర్యపడాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Aloo Bukhara : ఆల్ బుకరా పండు లోని ఉన్న ఔషధాలు తెలిస్తే ఆశ్చర్యపడాల్సిందే..!

Aloo Bukhara : ఆల్ బుకరా పండు ఉన్న ఔషధాల గురించి తెలిస్తే వెంటనే తినడం మొదలుపెడతారు. ఈ పండు రుచి కొంచెం పులుపుగా ఉంటుంది. ఈ పండు క్యాన్సర్ నివారణకు ఇవి బాగా పనిచేస్తాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఈ పండు లోని కాంపౌండ్లు జీర్ణశక్తిని క్రమబద్ధీకరించడంతోపాటు మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఈ పండులోని సి విటమిన్ వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఇన్ఫెక్షన్లు తలెత్తవు. అలాగే […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 August 2023,8:00 am

Aloo Bukhara : ఆల్ బుకరా పండు ఉన్న ఔషధాల గురించి తెలిస్తే వెంటనే తినడం మొదలుపెడతారు. ఈ పండు రుచి కొంచెం పులుపుగా ఉంటుంది. ఈ పండు క్యాన్సర్ నివారణకు ఇవి బాగా పనిచేస్తాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఈ పండు లోని కాంపౌండ్లు జీర్ణశక్తిని క్రమబద్ధీకరించడంతోపాటు మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఈ పండులోని సి విటమిన్ వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఇన్ఫెక్షన్లు తలెత్తవు. అలాగే గుండె జబ్బులు కూడా రావు.. ఈ పళ్ళు రొమ్ము శ్వాస సంబంధమైన క్యాన్సర్లను తగ్గిస్తాయి. ఇందులోని విటమిన్ ఏ దంత క్షయం నోటి క్యాన్సర్ల నుంచి రక్షిస్తుంది. కొలెస్ట్రాల ప్రమాణాలను ఆరోగ్యకరంగా ఉంచుతాయి.

కణాలకు శరీరానికి ఎంతో అవసరం. అంతే కాదు రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే రోజుకు మూడుసార్లు ఈ పండు తింటే వయసు పై పడటం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి. ఈ పళ్ళు శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడాలంటే ఈ పండ్లు బాగా తినాలి. ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి. అలాగే శరీరంలోని మలినాలను బయటకు పంపించడంతో అత్యంత సహజంగా శరీర బరువును ఈ పండ్లు తగ్గిస్తాయి. ఈ పళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పండులోని సిట్రిక్ యాసిడ్ అలసటను నొప్పులను తగ్గిస్తుంది. కాలేయం బాగా పనిచేసేటట్టు చేస్తుంది.

Aloo Bukhara is in the fruit If you know the medicines

Aloo Bukhara is in the fruit. If you know the medicines

ఈ పండులో గ్లైసిమిక్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో పనిచేస్తుంది. ఈ పండులోని కరిగిపోయే పీచు వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ల వల్ల తరచూ వచ్చే జ్వరాన్ని జలుబును నివారిస్తుంది. మహిళలు తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి. అలాగే కండరాల స్వేచ్ఛ కదలికకు మెగ్నీషియం చాలా అవసరం.

అంతేకాదు నరాల బాధలను తగ్గిస్తుంది. ఈ పండల్లో పోలిక్ యాసిడ్, కాల్షియం ఎక్కువ ప్రమాణాల్లో ఉన్నాయి.ఇవి తినడం వల్ల చర్మం పట్టులా తయారవుతుంది. ఈ పండ్లు బాగా తినడం వల్ల చర్మం బిగుతును కోల్పోతూ చర్మం పై ముడతలు ఏర్పడవు. దీనిలోఅధిక మోతాదులోని యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జీవక్రియ రక్త ప్రసరణలు బాగా జరిగేటట్టు చేస్తాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది