Categories: ExclusiveHealthNews

వీడియో : కృష్ణపట్నం ఆనంద‌య్య ఆయుర్వేద మందులో వాడే మూలిక‌లు ఇవే..!

Advertisement
Published by
Advertisement

krishnapatnam anandayya ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఎక్కడ చూసినా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు గురించే చర్చ. మీడియాలోనూ అవే కథనాలు. ప్రపంచానికే సవాల్ విసిరిన కరోనా మహమ్మారికి పసరు వైద్యంతో చెక్ పెట్టాడు ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య. అసలు.. ఏంటి ఆ పసరు వైద్యం.. ఆ మందులో అంత పవర్ ఉందా? కరోనాను చంపే శక్తి ఉందా? ఇంతకీ ఆ కరోనా మందును ఆయన ఎలా తయారు చేస్తున్నారు. దాంట్లో వాడే వనమూలికలు ఏంటి? ఆ మందు తింటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? పత్యం చేయాలా? ఇలా చాలామందికి కరోనా ఆయుర్వేద మందు గురించి…

Advertisement

ముందుగా కరోనా మందులో ఎటువంటి వన మూలికలను వాడుతారో తెలుసుకుందాం. అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్టా, లవంగాలు, వేప ఆకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి చెట్టు, కొండ పల్లేరు కాయల చెట్టు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింట ఆకుల చెట్టు, తెల్లజిల్లేడు పూల మొగ్గలు, ముళ్ల వంకాయలు.. ఇవే ఆ మందు తయారీలో వాడేవి. ఇందులో మనకు తెలియనివి ఏవీ లేవు. వీటిలో దాదాపు అన్నింటినీ మనం రోజూ వారి ఆహారంలో వాడుతూనే ఉంటాం. ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే.

Advertisement

krishnapatnam anandayya ayurvedic medicine

ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందులో వాడేవి krishnapatnam anandayya

అల్లం.. శరీరానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అల్లు.. శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. అందుకే.. మనం ప్రతి రోజూ కూరల్లో అల్లాన్ని వేసుకొని తింటాం.
ఇక.. తాటి బెల్లం దివ్యౌషధం. తాటిబెల్లాన్ని ప్రతి ఆయుర్వేద మందులో వాడుతుంటారు. ఆయుర్వేద మందులు కొంచెం చేదుగా, ఘాటుగా ఉంటాయి. చేదుగా ఉన్నవాటిని మింగడానికి ప్రజలు ఇష్టూపడరు కాబట్టి.. కాసింత తాటిబెల్లాన్ని ఆ మిశ్రమంలో కలుపుతారు. దీంతో రుచి తియ్యగా అవుతుంది. తాటి బెల్లం.. వల్ల ఏ ఔషధం గుణ ధర్మం కూడా చెడిపోదు. అందుకే.. ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో తాటి బెల్లాన్ని వాడుతుంటారు.ఇక తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. తేనె కఫాన్ని తగ్గిస్తుంది. అందుకే.. తేనెను ఈ మందు తయారీలో వాడుతున్నారు.నల్లజీలకర్ర శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. అలాగే.. నల్లజీలకర్రను వాడితే అలసట తగ్గుతుంది. బలహీనతకు కూడా చెక్ పెట్టొచ్చు.అలాగే తోకమిరియాలు, లవంగాలు యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. కీళ్ల నొప్పులను తగ్గించే గుణం లవంగాలలో ఉంటే.. జలుబు, దగ్గు, కండరాల నొప్పి నివారణకు తోక మిరియాలను వాడుతుంటారు.

ఇక.. అసలు సిసలైన వేప ఆకుల గురించి చెప్పాలంటే.. వేప శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, శిలీంద్రాలు, ఫంగస్ లను తరిమికొట్టే శక్తి వేప సొంతం. అందుకే.. రోజూ ఉదయాన్నే వేప పుల్ల వేసుకొని పళ్లు తోముకుంటాం. దగ్గు ఉన్నా.. కఫం, అస్తమా లాంటి శ్వాసకోశ సమస్యలను చెక్ పెట్టడానికి వేప ఆకు ఎంతో ఉపయోగపడుతుంది.నేరేడు చెట్టు మొత్తం ఔషధాల గని. నేరేడు పండ్లు, నేరేడు చిగుర్లు.. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. నేరేడులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కాలేయాన్ని క్లీన్ చేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ సోకినా.. బ్యాక్టీరియాను నాశనం చేయాలన్నా.. నేరేడు చిగుర్లు మంచి ఔషధం.

మామిడి చిగుర్లు, నేల ఉసిరి, కొండ పల్లేరు, కుప్పింటాకు, తెల్ల జిల్లేడు పువ్వు, పట్టా, బుడ్డబుడస ఆకు, ముళ్ల వంకాయ.. ఇవన్నీ ఆయాసాన్ని, వైరల్ ఫీవర్ ను, గొంతునొప్పి, దగ్గు, జలుబును తగ్గించడానికి.. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి.వీటన్నింటితో కలిపి చేసిన మిశ్రమం కరోనాను బ్రహ్మాండంగా మంచి ఔషధంలా తయారై.. కరోనాను తరిమికొట్టడంలో సూపర్ గా పనిచేస్తోందని ఆనందయ్యతో పాటు.. ఈ మందును వాడిన వేలాది మంది ప్రజలు కూడా చెబుతున్నారు. అలాగే.. ఈ మిశ్రమాన్ని వాడటం వల్ల.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని చెబుతుండటంతో ప్రజల్లో ఈ మందు మీదద నమ్మకం ఇంకాస్త పెరిగిందని చెప్పుకోవాలి.మామిడి చిగుర్లలోనూ అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. కడుపులో ఉన్న నులి పురుగులకు తొలగించడం కోసం, హై ఫీవర్ ను తగ్గించడం కోసం, కాలేయ సమస్యలకు చెక్ పెట్టడం కోసం మామిడి చిగుర్లను వాడుతుంటారు.

అలాగే నేల ఉసిరి కూడా మంచి ఔషధ మొక్క. ఇది వైరల్ ఫీవర్ ను తగ్గించేందుకు మంచి మందులా పనిచేస్తుంది. అలాగే.. మూత్ర సంబంధమైన వ్యాధులను తగ్గించడానికి.. ఉదర సంబంధమైన సమస్యలను తగ్గించడానికి కూడా నేల ఉసిరి బాగా వాడుతారు. ఇంకా పలు రకాల వైరస్ ను తగ్గించే శక్తి నేల ఉసిరికి ఉంటుంది. krishnapatnam anandayya కొండ పల్లేరు ఆకు కూడా దివ్యౌషధం. అది ఆయాసాన్ని, ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. కొండ పల్లేరు ఆకు వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. క్షయ వ్యాధిగ్రస్తులకు కూడా దీంతోనే ట్రీట్ మెంట్ చేస్తుంటారు. కుప్పింటాకును రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి నివారణకు ఇది దివ్యౌషధం. కీళ్ల నొప్పులను తగ్గించడానికి కూడా ఈ మొక్కను వాడుతారు. తెల్లజిల్లేడు పువ్వును ఎక్కువగా పాముకాటుకు విరుగుడుగా వాడుతుంటారు. తెల్లజిల్లేడు శరీరంలోని విషాన్ని గ్రహిస్తుంది. అస్తమా రోగులకు ఇది దివ్యౌషధం. బుడ్డబుడస ఆకు దీన్నే గాజు తీగ.. బంగారు తీగ లేదా తెల్ల జుమికి అని కూడా పిలుస్తారు. ఇవి అనేక మొండి వ్యాధులను నయం చేస్తాయి. krishnapatnam anandayya జీర్ణ వ్యవస్థ పటిష్ఠం అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముళ్ల వంకాయలో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ ఎన్నో రకాల సమస్యలను నివారిస్తాయి.

 

ఇది కూడా చ‌ద‌వండి ==> Krishnapatnam Ayurvedic Medicine : అసలు ఎవరీ కృష్ణపట్నం ఆనందయ్య? ఆయన నిజంగా ఆయుర్వేద నిపుణుడేనా?

Advertisement
Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Recent Posts

Dhurandhar telugu : సిగ్గుందా, ఆ సినిమా నుంచి ధురంధర్ ఫుల్ కాపీ !

Dhurandhar Telugu  : టాలీవుడ్‌లో  Tollywood ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.…

1 hour ago

AP Politics : కూటమి చేతికి బ్రహ్మాస్త్రం.. పవన్, చంద్రబాబు రెచ్చిపోతారు

AP Politics : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం పెను…

2 hours ago

Boduppal Circle : వేగవంతంగా బోడుప్పల్ సర్కిల్‌లో రోడ్ల మరమ్మతులు .. డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజకు కృతజ్ఞతలు

Boduppal Circle : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లో రోడ్ల దుస్థితిపై వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణమే…

3 hours ago

Tirumala Tirupati : తిరుమల వెళ్ళే వాళ్లకి బిగ్ బ్రేకింగ్ న్యూస్..!

Tirumala Tirupati Laddu  : కలియుగ వైకుంఠం తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా…

3 hours ago

CM Chandrababu : “బూతులు.. హత్యలు.. అబద్ధాలు”: వైసీపీ ఐదేళ్ల చీకటి పాలనను ఎండగట్టిన చంద్రబాబు !

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.…

4 hours ago

Allu Sneha Reddy : మరిది పెళ్లి పార్టీ లో మెరిసిపోతున్న అల్లు స్నేహ రెడ్డి.. వైర‌ల్ ఫోటోస్‌..!

Allu Sneha Reddy : అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు…

4 hours ago

Modi : ‘అమ్మ’ను ఆకాశానికి ఎత్తేసిన మోడీ..!

Modi : తమిళనాడు Tamil Nadu దివంగత సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జయలలితపై ప్రధాని నరేంద్ర మోడీ Modi ప్రసంశల…

5 hours ago

PM Kisan : రైతులకు షాకింగ్‌ న్యూస్‌ .. పీఎం కిసాన్ నిధుల పై ఈ రాష్ట్రాల్లో కేంద్రం కొత్త రూల్ ..!

PM Kisan : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వివరాల…

6 hours ago

Hyderabad : హైదరాబాద్‌లో పట్టు సాధించేందుకు రేవంత్ మాస్టర్ ప్లాన్

Hyderabad: తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…

7 hours ago

YSRCP : ఉన్నపళంగా 5 గురు వైసీపీకి రాజీనామా.. జగన్ కి షాక్..?

YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. మొన్నటి…

8 hours ago

Pension : పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త.. ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ..!

Pension : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త తెలియజేసింది. మార్చి 1, 2026 ఆదివారం…

9 hours ago

Donald Trump : బ్రేకింగ్ న్యూస్ .. నా వల్లే 3.5 కోట్ల మంది ప్రాణాలు నిలిచాయి .. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్–పాక్ మధ్య అణు యుద్ధం…

10 hours ago