Mutchintalapally Municipality : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ఛైర్మెన్ పీఠం కాంగ్రెస్ దే : తోటకూర వజ్రేష్ యాదవ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mutchintalapally Municipality : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ఛైర్మెన్ పీఠం కాంగ్రెస్ దే : తోటకూర వజ్రేష్ యాదవ్

 Authored By ramu | The Telugu News | Updated on :1 February 2026,10:20 pm

ప్రధానాంశాలు:

  •  Mutchintalapally Municipality : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ఛైర్మెన్ పీఠం కాంగ్రెస్ దే : తోటకూర వజ్రేష్ యాదవ్

  •  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్

Mutchintalapally Municipality : మూడుచింతలపల్లి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ Congress Party హస్తగతం చేసుకుంటుందని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు , మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ Thotakura Vajresh Yadav అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు…

Mutchintalapally Municipality మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ఛైర్మెన్ పీఠం కాంగ్రెస్ దే తోటకూర వజ్రేష్ యాదవ్

Mutchintalapally Municipality : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ఛైర్మెన్ పీఠం కాంగ్రెస్ దే : తోటకూర వజ్రేష్ యాదవ్

Mutchintalapally Municipality  ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మా విజయాన్ని చేకూరుస్తాయి

ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, బోడుప్పల్ మాజీ మేయర్, మూడు చింతలపాలెం మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జ్ తోటకూర అజయ్ యాదవ్ గారు పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ఛైర్మెన్ పదవి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే పార్టీ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే సరైన ఎంపికని అన్నారు.

ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, మున్సిపాలిటీ అభివృద్ధికి తమ పార్టీ పూర్తి కట్టుబాటుతో పనిచేస్తుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముల్లి జంగయ్య యాదవ్ గారు, మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్ గారు, మాజీ వార్డు సభ్యులు వెంకటనారాయణ గారు, SC సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, నాయకులు సిరాజ్ గారు, వివిధ హోదాలో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది