High Temperature : మరింతగా పెరిగిపోతున్న భానుడి తాపం… వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి…!
ప్రధానాంశాలు:
High Temperature : మరింతగా పెరిగిపోతున్న భానుడి తాపం... వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి...!
High Temperature : ఈ ఏడాది ఎండలు విపరీతంగా కొడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా భానుడు తన తాపంతో రికార్డు బ్రేక్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఎండలు దాటికి తట్టుకోలేక జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏ ప్రాంతంలో చూసిన 44 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ , బీహార్ ,పశ్చిమబెంగాల్ ,ఒడిస్సా వంటిి రాష్ట్రాలలో విపరీతంగా పెరుగుతున్న ఎండల కారణంగా రెడ్ అలెర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రెండు మూడు రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వడగాలులు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంట్లో నుండి బయటకు రావద్దని సూచిస్తున్నారు.
High Temperature : తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్…
ఇక తెలంగాణ ,సిక్కిం , కర్ణాటక వంటి రాష్ట్రాల విషయానికొస్తే ఈ ప్రాంతాలలో ఇప్పటికే ప్రభుత్వాలు ఆరంజ్ అలెర్ట్ ను ప్రకటించాయి. అంతేకాక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రత విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తుందని చెప్పాలి. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అంటే ఆలోచించదగ్గ విషయమేనని చెప్పాలి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అందిస్తున్న సమాచారం ప్రకారం 1921 తర్వాత 2024 కు ముందు సంవత్సరాలలో ఏ రోజు 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాలేదట. దాదాపు 100 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు అన్ని ప్రాంతాలలో దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఇక రానున్న 5 రోజుల్లో దేశవ్యాప్తంగా వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉందని తేలుస్తోంది. అంతేకాక దేశంలోని తూర్పు మరియు దక్షిణ భాగాల్లో తీవ్రమైన వేడి గాలులు వీచే ప్రమాదం ఉన్నందున మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు.

High Temperature : మరింతగా పెరిగిపోతున్న భానుడి తాపం… వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి…!
High Temperature : వాతావరణ శాఖ సూచనలు…
అధికంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని వాతావరణ శాఖకొన్ని రకాల సూచనలను జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోకపోవడం వలనే భూతాపం విపరీతంగా పెరుగుతుందని , మంచు కొండలు కరిగిపోతున్నాయని ,హిమ నినాదాలు కనుమరుగవుతున్నాయట. దీని కారణంగానే భూతాపం అధికమవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. కావున ఈ ఏడది ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు బయటికి రాకుండా ఉండటమే మంచిదిని చెబుతున్నారు. ఒకవేళ రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక ఈ సమయంలో నిత్యం నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. అదేవిధంగా నెత్తి మీద టోపీ , మొఖానికి తెల్లని గుడ్డ కట్టుకోవడం వలన ఎండ తగలకుండా రక్షించుకోవచ్చు.