Lockdown In India : దేశంలో మళ్లీ లాక్డౌన్? ‘ఎనర్జీ లాక్డౌన్’ అంటే ఏంటో తెలుసా?
Lockdown In India : కరోనా మహమ్మారి సృష్టించిన లాక్డౌన్ కష్టాలను దేశ ప్రజలు ఇంకా మర్చిపోకముందే, ఇప్పుడు మరో కొత్త రకం లాక్డౌన్ వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. అదే ‘ఎనర్జీ లాక్డౌన్’. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న వార్తలతో ఈ పదం ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లోకి వచ్చింది.
Lockdown In India : దేశంలో మళ్లీ లాక్డౌన్? ‘ఎనర్జీ లాక్డౌన్’ అంటే ఏంటో తెలుసా?
Lockdown In India : ఏమిటీ ఎనర్జీ లాక్డౌన్?
సాధారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ లేదా విద్యుత్ వంటి ఇంధన వనరుల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఈ ‘ఎనర్జీ లాక్డౌన్’ విధిస్తాయి. ఇది ప్రజల కదలికలపై ఆంక్షలు విధించడం కంటే, ఇంధన వినియోగాన్ని తగ్గించడంపై దృష్టి పెడుతుంది. ఇంధనాన్ని పొదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రజలను కోరడమే కాకుండా, కొన్ని కఠినమైన నిబంధనలను కూడా అమలు చేస్తుంది.
Lockdown In India : యుద్ధం తెచ్చిన తిప్పలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో హార్ముజ్ జలసంధి వంటి కీలక సరఫరా మార్గాలు మూతపడే ప్రమాదం ఉంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత్ తన చమురు అవసరాల కోసం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. సరఫరా ఆగితే దేశీయంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ముందే ఊహించిన అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA), ప్రపంచ దేశాలకు పలు సూచనలు చేసింది.
Lockdown In India : ఎలాంటి ఆంక్షలు ఉండవచ్చు?
ఎనర్జీ లాక్డౌన్ అమల్లోకి వస్తే ప్రధానంగా ఈ మార్పులు కనిపించవచ్చు
వర్క్ ఫ్రమ్ హోమ్: ప్రయాణాలను తగ్గించేందుకు సాఫ్ట్వేర్ మరియు ఇతర సంస్థలకు ఇంటి నుంచే పని చేసేలా ఆదేశాలివ్వడం.
వాహనాల నియంత్రణ: హైవేలపై వాహనాల వేగాన్ని తగ్గించడం, వారంలో కొన్ని రోజులు కార్లను రోడ్లపైకి రాకుండా చూడటం.
విద్యుత్ పొదుపు: షాపింగ్ మాల్స్, పబ్లిక్ ప్రదేశాల్లో ఏసీల వినియోగాన్ని తగ్గించడం, అనవసరమైన లైట్లను ఆపేయడం.
ప్రయాణాలు: అత్యవసరమైతే తప్ప విమాన ప్రయాణాలు చేయకపోవడం, వ్యక్తిగత వాహనాల కంటే ప్రజా రవాణాను (బస్సు, మెట్రో) వాడటం.
ప్రస్తుతానికి భారత్లో పూర్తిస్థాయి లాక్డౌన్ లాంటి పరిస్థితులు లేకపోయినా, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇంధన పొదుపు పాటించడం అత్యవసరమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.