YS Jagan : వైసీపీ సీనియర్ నేతలకు జగన్ బిగ్ షాక్? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YS Jagan : వైసీపీ సీనియర్ నేతలకు జగన్ బిగ్ షాక్?

YS Jagan : వైఎస్ జగన్.. ఏపీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను పర్ ఫెక్ట్ గా నిర్వర్తిస్తూనే.. వైఎస్సార్సీపీ పార్టీ అధినేతగా కూడా తన బాధ్యతలను అంతే శ్రద్ధతో నెరవేర్చుతున్నారు. ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. మరో వైపు పార్టీని బలోపేతం చేస్తున్నారు. నిజానికి సీఎం జగన్ కొంచెం రిజర్వ్ డ్ పర్సన్. ఎక్కువగా మాట్లాడరు. ఆయన మాట్లాడే తీరు గురించి వైసీపీ నేతలకు బాగా తెలుసు. తక్కువ మాట్లాడినా.. కంటెంట్ కరెక్ట్ గా ఎవరికి […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :3 June 2021,8:30 pm

YS Jagan : వైఎస్ జగన్.. ఏపీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను పర్ ఫెక్ట్ గా నిర్వర్తిస్తూనే.. వైఎస్సార్సీపీ పార్టీ అధినేతగా కూడా తన బాధ్యతలను అంతే శ్రద్ధతో నెరవేర్చుతున్నారు. ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. మరో వైపు పార్టీని బలోపేతం చేస్తున్నారు. నిజానికి సీఎం జగన్ కొంచెం రిజర్వ్ డ్ పర్సన్. ఎక్కువగా మాట్లాడరు. ఆయన మాట్లాడే తీరు గురించి వైసీపీ నేతలకు బాగా తెలుసు. తక్కువ మాట్లాడినా.. కంటెంట్ కరెక్ట్ గా ఎవరికి చేరాలో వారికి చేరుతుంది. అదే జగన్ లో ఉన్న గొప్ప గుణం. ఇటీవల తిరుపతి ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచినా సరే.. సీఎం జగన్ మాత్రం.. ఆ ఫలితాల విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారట. ఎందుకంటే.. అక్కడ భారీ మెజారిటీతో గెలవాలని జగన్ భావించారు కానీ.. వైసీపీనే గెలిచినా.. మెజారిటీ అంతగా రాలేదు.

తిరుపతి ఉపఎన్నికల్లో కొందరు వైసీపీ నేతలు అనుకున్నంత రీతిలో పనిచేయలేదనే అపవాదు కూడా ఉంది. దీంతో సీఎం జగన్ కొందరు సీనియర్ నేతలపై చాలా సీరియస్ గా ఉన్నారట. నిజానికి సీఎం జగన్ ఎక్కువగా యూత్ కే ప్రాధాన్యత ఇస్తుంటారు. దానికి ఉదాహరణే ఆయన ఏర్పాటు చేసిన మంత్రివర్గం. తన మంత్రివర్గంలో ఎక్కువ శాతం యూత్ కు చోటు దక్కింది. కొందరు సీనియర్లను జగన్ కావాలనే మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కను పెట్టారు.

ap cm ys jagan warning to ysrcp leaders

ap cm ys jagan warning to ysrcp leaders

YS Jagan : సీనియర్లను పక్కన పెట్టి.. యువ నేతలను ప్రశంసించిన జగన్

తిరుపతి ఉపఎన్నికల్లో ఎంపీగా గెలిచిన గురుమూర్తి తాజాగా చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులతో కలిసి సీఎం జగన్ ను కలిశారట. ఆ సమయంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఆ సమయంలో సీఎం జగన్.. సీనియర్ ఎమ్మ ల్యేలను పక్కన పెట్టి.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి.. తిరుపతి ఉపఎన్నికల్లో బాగా పనిచేశారని మెచ్చుకున్నారట. అలాగే.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూతురు పవిత్రా రెడ్డి కూడా బాగా పనిచేశారని సీఎం జగన్ మెచ్చుకున్నారట. ఇలా.. యువ నేతలందరినీ సీఎం జగన్ పొగుడుతుండటం.. అసలు సీనియర్ నేతలను పట్టించుకోకపోవడంతో.. సీనియర్ నేతలకు అసలు సీన్ ఏంటో అర్థం అయిందట. సీఎం జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే భవిష్యత్తులో కూడా సీనియర్లను పక్కన పెట్టి.. యూత్ కే అవకాశాలు ఇస్తారని స్పష్టంగా అర్థం అవుతోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఏ క్ష‌ణ‌మైనా మూడు రాజ‌ధానులు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేసిన బొత్స , విజ‌య‌సాయిరెడ్డి

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆనంద‌య్య కంట్లో వేసే మందు రిపోర్ట్ వ‌చ్చింది.. సైడ్ ఎఫెక్ట్స్‌ లేవు కానీ..!

ఇది కూడా చ‌ద‌వండి ==> YSRCP : అక్కడ వైసీపీకి నిఖార్సయిన నాయకుడు కావాల్సిందే?

ఇది కూడా చ‌ద‌వండి ==> మ‌ళ్లీ రాఘురామ‌కు ఆ పార్టీ నుంచి న‌ర‌సాపురం టికెట్ ఖాయం..!

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది