Today Gold Rates :ఇటీవల స్త్రీలు బంగారంపై ఎక్కుగా మోజు చూపిస్తున్నారు. ఏదైన ఫంక్షన్ కి వెళ్లాలంటే ఒంటి నిండా బంగారం దిగేయాల్సిందే. ధరలు ఎక్కువగా ఉన్నా కూడా బంగారం కొనుగోలు చేయాల్సిందే అంటున్నారు మహిళలు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. వరుసగా తగ్గడం, ఆ వెంటనే పెరగడం కనిపిస్తుంది. శుక్రవారం కాస్త తగ్గిన బంగారం ధర శనివారంకి వచ్చే సరికి పైపైకి వెళ్లింది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 పెరిగి.. రూ. 46,400కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 46,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 440 పెరిగి.. రూ. 50,620కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 50,180గా ఉండేది.
పసిడి ప్రియం..
దేశంలోని ఇతర ప్రాంతాలలో బంగారం ధరలు పరిశీలిస్తే .. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,400 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 50,620గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,800గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,150గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 46,420గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,640గాను ఉంది. ఇక హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,400గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,620గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
గడిచిన మూడు వారాలుగా మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల కారణంగా బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడం, అంతే స్థాయిలో పతనం కావడం, మళ్లీ పైపైకి కదలడం సాధారణంగా మారింది. డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ రూ.80కి పడిపోయిన తర్వాత బంగారం ధరలు పెరిగాయి. ఇక వెండి విషయానికి వస్తే దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. కేజీ వెండి రూ. 200 తగ్గి.. రూ. 55,400గా ఉంది. శుక్రవారం ఈ ధర రూ. 55,600గా ఉండేది. కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 61,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాల్ 55,400.. బెంగళూరులో 61,600.. ముంబైలో 55,400.. చెన్నైలో 61,600గా ఉన్నాయి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.