Kurnool : టమాట తోటలో పనికి వెళ్లిన మహిళ.. లక్షాధికారి అయింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kurnool : టమాట తోటలో పనికి వెళ్లిన మహిళ.. లక్షాధికారి అయింది..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 June 2021,12:30 pm

Kurnool : ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు? అంటూ మన పెద్దలే చాలా సార్లు చెప్పారు. అవును.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఈ క్షణం వరకు పేదోడిగా ఉన్న వ్యక్తి.. మరుక్షణంలో కోటీశ్వరుడు అవుతున్నాడు. అంతా కాలం నిర్ణయిస్తుంది. ఎప్పుడు ఎవరు ఏం అవుతారో? ఓ మహిళ కూడా అంతే. తను ఏనాడు కూడా లక్షాధికారి అవుతానని కలలో కూడా ఊహించలేదు. అసలు.. రోజూ మూడు పూటల భోజనం దొరికితే చాలు.. అని అనుకున్న ఆ మహిళ.. ఒక్క రోజులోనే లక్షాధికారి అయింది.

woman found diamond in kurnool

woman found diamond in kurnool

ఎలగెలగా అంటారా? ఓ మహిళ.. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఓ రోజు టమాట తోటలో కూలి పనికి వెళ్లింది. అక్కడే ఆమెకు అదృష్టం వరిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆరోజు ఆమె లక్షాధికారి అవుతుందని కూడా ఎవ్వరూ అనుకోలేదు. టమాటాలు ఏరుతుండగా.. ఆమెకు తోటలో రంగురంగులతో మెరిసిపోతున్న ఓ రాయి దొరికింది. ఇదేంటి.. ఇలా మెరిసిపోతోందని.. ఆ మహిళ.. అక్కడ ఉండే బంగారం వ్యాపారికి చూపించింది. దీంతో దాన్ని టెస్ట్ చేసిన వ్యాపారి.. అది వజ్రం అని తేల్చాడు.

Kurnool : లక్షల విలువ చేసే వజ్రం అది

అది నాలుగున్నర క్యారెట్లు ఉన్న వజ్రం అట. అదే గ్రామానికి చెందిన మరో వ్యాపారి.. ఆ మహిళ దగ్గర ఉన్న వజ్రాన్ని తీసుకొని.. 6.5 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు.. 2 తులాల బంగారం కూడా ఇచ్చాడట. దీంతో ఆ మహిళ ఒక్కరోజులోనే లక్షాధికారి అయిపోయింది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కర్నూలు జిల్లాలోని తుగ్గలి ప్రాంతంలో వజ్రాలు ఇదివరకు కూడా చాలామందికి దొరికాయి. ఇటీవల కూడా ఓ రైతుకు వజ్రం దొరికింది. తన పొలంలోనే వజ్రం దొరకగా.. దాన్ని అమ్మితే.. కోటి రూపాయలు వచ్చాయి. ఇలా… చాలాసార్లు ఆ ప్రాంతంలో చాలామందికి వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. ఇప్పటికీ.. కొందరు వజ్రాల కోసం వెతుకుతూనే ఉంటారు. కానీ.. అవి అదృష్టం ఉన్నవాళ్లకే దొరుకుతుంటాయి.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది