Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
ప్రధానాంశాలు:
Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Rajiv Yuva Vikasam : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసిన యువత ఇప్పుడు శాంక్షన్ లెటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ పథకానికి సెలెక్ట్ అయిన లబ్ధిదారులకు జూన్ 2 నుంచి శాంక్షన్ లెటర్లు అందజేస్తామని వెల్లడించారు. మండలాల వారీగా ఈ ప్రక్రియను నిర్వహించి జూన్ 9లోగా పూర్తిచేస్తామని పేర్కొన్నారు.

Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారు ఆ తేదీని గుర్తుపెట్టుకోండి
రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం టీజీపీఎస్సీ ద్వారా భారీగా ఉద్యోగాలు ఇచ్చామని, అయినా ఇంకా ఉద్యోగాలు పొందలేని యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని రూపొందించామని చెప్పారు. ఈ పథకానికి ఇప్పటికే రూ.9 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి, దశలవారీగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. నోటిఫికేషన్, అప్లికేషన్ తేదీలను కూడా ప్రకటించామని తెలిపారు.
దరఖాస్తులు ఏప్రిల్ 14 వరకు అందుబాటులో ఉంటాయని, https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చని చెప్పారు. రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉన్న ప్రతి నిరుద్యోగ యువకుడు ఈ పథకానికి అర్హుడు అని తెలిపారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాంక్షన్ లెటర్లు ఇచ్చిన తర్వాత, వారు ఎంచుకున్న స్వయం ఉపాధి పథకాలపై ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. యువత ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.