
Pawan Kalyan
pawan kalyan : ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు అనే సామెత గురించి అందరు వినే వుంటారు. దానిని మరోసారి గుర్తుచేస్తున్నాయి పవన్ కళ్యాణ్ మాటలు. నిజానికి రెండు ప్రత్యర్థి పార్టీలైన సరే ఒక వైపు ఎన్నికలు జరుగుతున్నా సమయంలో మరోవైపు ప్రెస్ మీట్ పెట్టి ఒక పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవు. అలాంటిది మిత్ర పార్టీగా భావించే బీజేపీ విషయంలో జనసేన అధినేత వ్యవహరించిన తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
తెలంగాణలో హోరాహోరీగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్, ఒక పక్క పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా, తెరాస నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చి సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యాడు. అయితే ఇన్నాళ్లు మౌనంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ కీలకమైన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటో చాలా మందికి అర్ధం కావటం లేదు.
నిజానికి తెలంగాణ బీజేపీ నేతలు గ్రేటర్ ఎన్నికల సమయంలో జనసేన పార్టీని తక్కువ చేసి మాట్లాడారు అంటూ జనసైనికులు బాధపడ్డారు. అప్పుడు మౌనంగా ఉన్న పవన్, నేడు తెలంగాణ బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడటం వెనుక కేవలం గ్రేటర్ ఎన్నికల సమయంలో జరిగిన అవమానం ఒక్కటే కాదని ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీచేయాలని ఎప్పటినుండో భావిస్తుంది. అందుకోసమే గ్రేటర్ లో పోటీనుండి తప్పుకు తప్పుకొని బీజేపీకి మద్దతు ఇచ్చింది.
Pawan Kalyan
తీరా ఇప్పుడు తిరుపతి ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి బీజేపీ హ్యాండ్ ఇచ్చి, తామే పోటీచేస్తామని చెప్పటంతో కాకుండా, తెలివిగా జనసేనను పక్కకు తప్పించింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ బాగా హార్డ్ అయినట్లు తెలుస్తుంది, కాకపోతే పొత్తు ధర్మం ప్రకారం బీజేపీని డైరెక్ట్ గా ఏమి అనలేక, తిరుపతి విషయంలో సైలెంట్ అయ్యాడు. అయితే మరోపక్క జనసైనికులు మాత్రం ఈ విషయంలో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇలాగైతే పార్టీని నడిపించటం కష్టమని, బీజేపీతో ఉంటే ఎలాంటి లాభం లేకపోగా, దాని వలన మరింత నష్టం కలుగుతుందని పవన్ కళ్యాణ్ ముందే కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తుంది.
దీనితో ఆలోచనలో పడిన పవన్ కళ్యాణ్ ఎలాగైనా తన వ్యతిరేక స్వరాన్ని వినిపించాలని భావించి, అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేశాడు. దీనితో ఖచ్చితంగా కేంద్ర అధిష్టానం నుండి పిలుపు రావటం ఖాయమని పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసు, అదే జరిగితే తాడో పేడో తేల్చుకోవడానికి కూడా ఒక రకంగా సిద్దమయ్యాడు అని జనసేన వర్గాలు చెపుతున్నాయి. ఇక్కడ మరోకోణం దాగిఉంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తే దానిని గౌరవించ కూడా జనసేన విషయంలో చవకబారు ఆరోపణలు చేశారు బీజేపీ నేతలు, ఇప్పుడు తిరుపతిలో మద్దతు ఇవ్వటంతో మరోసారి బీజేపీ అలాంటి ఆరోపణలు చేస్తే జనసేన కు ప్రజల్లో కొద్దో గొప్పో ఉన్న ఇమేజ్ పోవటం ఖాయం. అందుకే బీజేపీకి ఒక హెచ్చరిక లాంటిది జారీ చేసినట్లు అవుతుందని అలోచించి జనసేనాని ఇలాంటి వ్యాఖ్యలు చేసాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.