Sajjala Ramakrishna Reddy : సజ్జల రామకృష్ణారెడ్డి ఒంటరివాడయ్యాడా.. వైసీపీలో ఏం జరుగుతుంది..?
ప్రధానాంశాలు:
Sajjala Ramakrishna Reddy : సజ్జల రామకృష్ణారెడ్డి ఒంటరివాడయ్యాడా.. వైసీపీలో ఏం జరుగుతుంది..?
Sajjala Ramakrishna Reddy : వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తనదే అన్నట్టుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అనూహ్యంగా ఒంటరి వాడయ్యాడా అన్న భావన కలుగుతుంది. నిజంగానే సజ్జల ఒంటరి అయ్యారా? ఆయనకు అవసరమైన టైం లో ఉండాల్సిన నేతలు వెన్నుదన్నుగా లేకుండా పోయారా.. అధినేత జగన్ సైతం ఆయనను పక్కన పెట్టారా.. అంటే వీటన్నిటికీ ఒకటే సమాధానం అవుననే వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమే అని చెప్పక తప్పదు. వైసీపా అధికారం లో ఉన్న ఐదేళ్లు పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా నెంబర్ 2 గా ఉన్న సజ్జల జగం ఆయన కుటుంబ సభ్యులైన విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి ని కూడా కాదని సజ్జలకే జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సజ్జల తనయుడు భార్గవ్ రెడ్డికి వైసీపీ పార్టీ కీలకమైన సోషల్ మీడియా ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారినట్టు తెలుస్తుంది.
Sajjala Ramakrishna Reddy వైసీపీ అధికారానికి దూరమవడంతో..
వైసీపీ అధికారానికి దూరమవడంతో పూర్తిగా సీన్ మారిపోయింది. ఓటమికి సజ్జల ఇచ్చిన సలహాలే కారణ్మని కూడా కొందరు ఆరోపిస్తున్నారు. ఓటమి తర్వాత సజ్జల కూడా జగన్ ఏర్పాటు చేసిన మీటింగ్స్ లో అంతగా పాల్గొనలేదు. ఇది చాలదు అన్నట్టుగా సజ్జల కొడుకుని భార్గవరెడ్డిని సోషల్ మీడియా ఇంచార్జ్ బాధ్యతల నుంచి తీసేశారు. అధికారంలో ఉన్నప్పుడు సజ్జల ఏది చెబితే అది జరిగింది. ఓటమికి అతనే కారణమని చెప్పడంతో సజ్జల పార్టీలో ఒంటరివాడు అయ్యాడని తెలుస్తుంది.

Sajjala Ramakrishna Reddy : సజ్జల రామకృష్ణారెడ్డి ఒంటరివాడయ్యాడా.. వైసీపీలో ఏం జరుగుతుంది..?
టీడీపీ కార్యాలయం పై దాడి కేసు సజ్జల మెడకు చుట్టుకుంది. మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హారజైన సజ్జల వెంట పట్టుమని పదిమంది కూడా లేదు. ఒకప్పుడు సజ్జల ఉన్న చోట వైసీపీ నేతలంగా ఉండేవారు. ఇప్పుడు కేవలం ఆయన వెంట పొన్నవోలు సుధాకర్ రెడి ఒకరిద్దరు నాయకులు మాత్రమే ఉన్నారు. అంతేకాదు సజ్జలకు మద్ధతుగా జగన్ కూడా మాట్లాడలేదు. ఇదంతా చూస్తే సజ్జలని కావాలని సై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.