Sajjala Ramakrishna Reddy : మాట మార్చిన సజ్జల.. అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదంటూ కొత్త పలుకు

 Authored By sudheer | The Telugu News | Updated on :11 January 2026,2:30 pm

ప్రధానాంశాలు:

  •  Sajjala Ramakrishna Reddy : మాట మార్చిన సజ్జల.. అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదంటూ కొత్త పలుకు

Sajjala Ramakrishna Reddy : ఏపీ రాజధాని అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో, వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు. జగన్ ఎప్పుడూ అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదని, కేవలం అక్కడ జరుగుతున్న అవకతవకలను, ప్రజా ధనం దుర్వినియోగాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారని సజ్జల స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయలను దారి మళ్లిస్తోందని, రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన ప్రాథమిక సమస్యలను పరిష్కరించకుండా కొత్త ప్రాజెక్టుల పేరుతో కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు.

Sajjala Ramakrishna Reddy : మాట మార్చిన సజ్జల.. అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదంటూ కొత్త పలుకు

Sajjala Ramakrishna Reddy : మాట మార్చిన సజ్జల.. అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదంటూ కొత్త పలుకు

రైతుల ప్రయోజనాలే పరమావధిగా జగన్ కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తారని సజ్జల వివరించారు. మొదటి దశలో భూములిచ్చిన రైతులకు ఇప్పటివరకు రోడ్లు, కనెక్టివిటీ వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని, ప్లాట్ల అభివృద్ధి కూడా పూర్తి కాలేదని ఆయన గుర్తు చేశారు. అసంపూర్తిగా ఉన్న పనులను పక్కన పెట్టి, రెండో దశ భూ సమీకరణకు వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను చెరువుల్లో కేటాయించడం వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారని, అభివృద్ధి చేయని ప్లాట్లను ఎవరూ కొనుగోలు చేయరని జగన్ అడిగిన దానిలో తప్పేముందని సజ్జల నిలదీశారు. అమరావతిని ముంపు ప్రాంతం నుంచి కాపాడేందుకు లిఫ్ట్‌లు, రిజర్వాయర్ల పేరుతో ఖర్చు చేస్తున్న నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావడం లేదని మండిపడ్డారు.

Sajjala Ramakrishna Reddy : “వేల కోట్ల దోపిడీ”పై ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది

ప్రభుత్వం తమ ప్రశ్నలకు వాస్తవాలతో సమాధానం చెప్పాల్సింది పోయి, వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని సజ్జల హితవు పలికారు. అమరావతి పేరుతో జరుగుతున్న ఈ “వేల కోట్ల దోపిడీ”పై ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే జగన్ స్పందించారని, రాజధాని ప్రాంతంలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఆయన మాట్లాడారని సమర్థించారు. రాజధాని నిర్మాణంలో ప్రధాన భాగస్వాములైన రైతుల సమస్యలను గాలికి వదిలేసి, కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే పనులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి