KCR : నిరోధులు అమ్ముకొని బతకాలా… బిడ్డ కింద వేసి తొక్కుతా… జాగ్రత్త… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : నిరోధులు అమ్ముకొని బతకాలా… బిడ్డ కింద వేసి తొక్కుతా… జాగ్రత్త…

KCR :  తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల జోరు ముగిసిన తర్వాత ఇప్పుడు లోక్ సభ ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఈక్రమంలోనే పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల ఆదరణ పొందేందుకు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా సమావేశాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా పాల్గొనడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాకముందు ప్రజలకు అన్ని ఇస్తామని హామీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 April 2024,6:30 pm

ప్రధానాంశాలు:

  •  KCR : నిరోధులు అమ్ముకొని బతకాలా....బిడ్డ కింద వేసి తొక్కుతా... జాగ్రత్త...

  •  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు..

  •  వాళ్లు ఆ విధంగా బతకాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి అంటూ కెసిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు...

KCR :  తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల జోరు ముగిసిన తర్వాత ఇప్పుడు లోక్ సభ ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఈక్రమంలోనే పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల ఆదరణ పొందేందుకు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా సమావేశాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా పాల్గొనడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాకముందు ప్రజలకు అన్ని ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమీ ఇవ్వకుండా కుండలు కాళీగా ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు. ప్రజలకు ఇవ్వలేనప్పుడు హామీలను ఎందుకు ఇవ్వాలి అని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

KCR నిరోధులు అమ్ముకొని బతకాలా బిడ్డ కింద వేసి తొక్కుతా జాగ్రత్త

KCR : నిరోధులు అమ్ముకొని బతకాలా… బిడ్డ కింద వేసి తొక్కుతా… జాగ్రత్త…

ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు , దళిత బంధువులకు , పెన్షన్ దారులకు, మహాలక్ష్మి మహిళలకు , రైతుల రుణమాఫీకి, రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పంగనామాలు పెట్టారు. అంతేకాక రైతుబంధు కావాలని అడిగితే ఓ కాంగ్రెస్ నాయకుడు చెప్పుతో కొడతా అంటాడు. రైతులను చెప్పుతో కొడతారా…రైతులకు కూడా చెప్పులు ఉంటాయి అవి తిరగబడితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకొండి అంటూ కేసీఆర్ హెద్దేవ చేశారు. అదేవిధంగా సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి కనిపిస్తుందని అడిగితే ఇంకో కాంగ్రెస్ నాయకుడు వాళ్లను నిరోదులు, పాపడాలు అమ్ముకొని బతకమన్నట్టు చెబుతున్నారట.

వాళ్లు ఆ విధంగా బతకాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి అంటూ కెసిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాదిమంది చేనేత కార్మికుల మనోభావాలను దెబ్బతీస్తారా…?మీరిస్తే ఇవ్వండి లేకపోతే మూసుకొని కూర్చోండి కానీ పాపడాలు ,నిరోధులు అమ్ముకొని బతకడానికి వాళ్ళు మీకు మనుషుల్లాగా కనిపించడం లేదా అంటూ కేసిఆర్ అగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే చేనేత కార్మికులు మిమ్మల్ని తరిమికొడతారు జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ తెలియజేశారు. దీంతో ప్రస్తుతం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది