Chittor.. నాలుగు కిలోమీటర్ల పాటు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం..

Authored By praveen T | The Telugu News | Updated on : 5 September 2021, 7:17 pm

రోజురోజుకూ కాలుష్యం బాగా పెరిగిపోతుండటం, అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండటం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు చెట్ల పరిరక్షణకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. సెలబ్రిటీలు సైతం మొక్కల పెంపకం వాటి ఆవశ్యకత గురించి తెలుపుతూ మొక్కలు నాటుతున్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నారు. ఏపీ సర్కారు ‘జగనన్న పచ్చతోరణం’ పేరిట మొక్కలను నాటుతున్నది. ఆదివారం శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

రేణిగుంట మండలం గాజులమండ్యం, అత్తురు పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్తురు పంచాయతీ పరిధిలో నాలుగున్నర కిలోమీటర్ల మేర దాదాపు 1,800 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. జగన్ నాయకత్వంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బియ్యపు వెంట ఎంపీడీఓ, తహసీల్దార్, ఏపీఓలు, మండల స్థాయి అధికారులు ఉన్నారు.

 

praveen T

No bio available for this author.

  1. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

  2. "Sprouted Green Gram : కోడిగుడ్లు, పాలకంటే ఎక్కువ ప్రొటీన్.. ఈ సూపర్ ఫుడ్ తెలుసా?.. రోజూ గుప్పెడు చాలు!"

  3. "Fennel Water : డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీరు వరమా?.. రోజూ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  4. "Tirumala : తిరుమలలో రూమ్ దొరకలేదా? అయితే నిరాశ చెందొద్దు.. టీటీడీ ఉచితంగా అందిస్తున్న ఈ సదుపాయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!"

  5. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  6. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  7. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp