Chittoor.. కాణిపాక గణనాథుడికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chittoor.. కాణిపాక గణనాథుడికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ

జిల్లాలోని కాణిపాకంలోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకుడికి శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు శాసన సభ్యుడు ఎంఎస్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్రత సంకల్పం పూజా కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. అనంతరం మంత్రి, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కరోనా బారి నుంచి దేశం రాష్ట్రం విముక్తి […]

 Authored By praveen | The Telugu News | Updated on :10 September 2021,10:19 pm

జిల్లాలోని కాణిపాకంలోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకుడికి శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు శాసన సభ్యుడు ఎంఎస్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్రత సంకల్పం పూజా కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. అనంతరం మంత్రి, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కరోనా బారి నుంచి దేశం రాష్ట్రం విముక్తి పొందాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.

కొవిడ్ బారిన పడుకుండా ఉండేందుకు ప్రజలు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు డోసుల వ్యాక్సిన్ కూడా తీసుకుంటున్నారు. ఇకపోతే రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకునేందుకుగాను పరిమితుల విషయమై చర్చ జరిగింది. ఈ సందర్భంలో కొందరు కోర్టును ఆశ్రయించగా, కోర్టు అనుమతులతో వినాయక చవితి సంబురాలు స్టార్ట్ అయ్యాయి.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది