Akkineni Nagarjuna : అక్కినేని వారి ‘ఆచార్య’… ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Akkineni Nagarjuna : అక్కినేని వారి ‘ఆచార్య’… ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ

Akkineni Nagarjuna : మెగాస్టార్ చిరంజీవి – Chiranjeevi మరియు ఆయన తనయుడు రామ్‌ చరణ్ – Ram Charan కలిసి నటించిన ఆచార్య – Acharya సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దర్శకుడు కొరటాల శివ – Koratala Siva సినిమా ను అత్యంత దారుణంగా తెరకెక్కించాడు అంటూ విమర్శలు వచ్చాయి. చిరంజీవి మరియు రామ్‌ చరణ్ ఉన్న నేపథ్యంలో ఆయన మినిమం మంచి కథతో ఒకింత మంచి స్క్రీన్‌ ప్లేతో సినిమాను […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 August 2022,8:00 pm

Akkineni Nagarjuna : మెగాస్టార్ చిరంజీవి – Chiranjeevi మరియు ఆయన తనయుడు రామ్‌ చరణ్ – Ram Charan కలిసి నటించిన ఆచార్య – Acharya సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దర్శకుడు కొరటాల శివ – Koratala Siva సినిమా ను అత్యంత దారుణంగా తెరకెక్కించాడు అంటూ విమర్శలు వచ్చాయి. చిరంజీవి మరియు రామ్‌ చరణ్ ఉన్న నేపథ్యంలో ఆయన మినిమం మంచి కథతో ఒకింత మంచి స్క్రీన్‌ ప్లేతో సినిమాను తీసి ఉంటే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు సినిమాకు బ్రహ్మరథం పట్టే వారు అనడంలో సందేహం లేదు. ఒక మంచి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ మిస్‌ అయ్యిందని మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి, కొడుకులు నటించిన సినిమా అంటే.. నటించబోతున్న సినిమా అంటే సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ మధ్య మంచు వారి కుటుంబ సభ్యులు కలిసి నటించారు అంటేనే తెలుగు ప్రేక్షకులు అంతా కూడా అటువైపు చూశారు. అలాంటిది ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుండి తండ్రి కొడుకులు ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారట. చిరంజీవితో ప్రస్తుతం లూసీఫర్ సినిమాను చేస్తున్న దర్శకుడు మోహన్‌ రాజా. ఆయన దర్శకత్వంలో రూపొందిన లూసీఫర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Akkineni Nagarjuna and akhil multi starrer movie coming soon in mohan raja direction

Akkineni Nagarjuna and akhil multi starrer movie coming soon in mohan raja direction

ఈ దర్శకుడు మోహన్‌ రాజా ఇటీవలే నాగార్జున – Nagarjuna మరియు అఖిల్ – Akhil లకు ఒక కథ చెప్పారట. ఆ కథ బాగుందని వార్తలు వస్తున్నాయి. మల్టీ స్టారర్ కాన్సెప్‌.. అలాగే అండ్రి కొడుకుల కాన్సెప్ట్‌.. దాంతో అక్కినేని వారి ఆచార్య సినిమా అన్నట్లుగా అప్పుడే చర్చ మొదలు అయ్యింది. తండ్రి కొడుకులు కలిసి నటించడం వల్ల అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నాగార్జున మరియు అఖిల్‌ లతో ఒక మంచి మల్టీ స్టారర్‌ సినిమాను దర్శకుడు మోహన్‌ రాజా తీస్తాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. అతి త్వరలోనే సినిమా గురించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది