Suresh Babu : ఫిలింనగర్ భూ వివాదంలో నిర్మాత సురేష్ బాబు, రానా లపై కేసు నమోదు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Suresh Babu : ఫిలింనగర్ భూ వివాదంలో నిర్మాత సురేష్ బాబు, రానా లపై కేసు నమోదు..!!

Suresh Babu : గత కొంతకాలంగా ఫిలింనగర్ లో ఓ ల్యాండ్ కి సంబంధించి వివాదం నడుస్తూ ఉంది. ఈ వివాదంలో నిర్మాత సురేష్ బాబు హీరో రానాకీ వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఈ వివాదం విషయంలో పలుమార్లు రానా కోర్టుకు కూడా హాజరు కావడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సురేష్ బాబు మరియు రానా ఇటీవల తనని రౌడీల సహాయంతో బెదిరించి తన స్థలం నుండి ఖాళీ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :11 February 2023,12:20 pm

Suresh Babu : గత కొంతకాలంగా ఫిలింనగర్ లో ఓ ల్యాండ్ కి సంబంధించి వివాదం నడుస్తూ ఉంది. ఈ వివాదంలో నిర్మాత సురేష్ బాబు హీరో రానాకీ వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఈ వివాదం విషయంలో పలుమార్లు రానా కోర్టుకు కూడా హాజరు కావడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సురేష్ బాబు మరియు రానా ఇటీవల తనని రౌడీల సహాయంతో బెదిరించి తన స్థలం నుండి ఖాళీ చేయించారని.. బంజారాహిల్స్ పోలీసులకు ప్రమోద్ కుమార్ ఫిర్యాదు చేశారు. కానీ సదరు వ్యాపారి ఫిర్యాదును బంజర హిల్స్ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు.

case registered against suresh babu and rana in filmnagar land dispute

case registered against suresh babu and rana in filmnagar land dispute

దీంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో… పోలీసులకు సంబంధం లేకుండా నాంపల్లి కోర్టు కేసు నమోదు చేసింది. సురేష్ బాబు రానా సహా మరి కొంతమంది పై కేసు నమోదు అయింది. దీంతో విచారణకు రావాలని రానా మరియు సురేష్ బాబు కి నాంపల్లి కోర్టు సమాన్లు జారీ చేయడం జరిగింది. అసలు గొడవ చూస్తే ఫిలింనగర్ లో సురేష్ బాబుకి ఉన్న ఓ స్థలాన్ని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికి లీజుకి ఇవ్వడం జరిగింది. ప్రతి రెండేళ్లకి ఆ లీజు రెన్యూవల్ చేస్తారు.

కానీ కొన్ని నెలల క్రితం ఆ స్థలం లీజులో ఉండగానే అందులో కొంత భాగాన్ని రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటంతో పాటు వ్యాపారిని ఖాళీ చేయమని ఒత్తిడి తేవడంతో ప్రమోద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగకపోవటంతో కోటిని ఆశ్రయించడంతో పోలీసులతో సంబంధం లేకుండా సురేష్ బాబు మరియు రానా మరికొంతమందిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది