Mohan Babu : ఇద్ద‌రు హీరోలు కావాల‌ని ట్రోల్స్ చేయిస్తున్నారు.. ఆ రోజు వారికి శిక్ష త‌ప్ప‌ద‌న్న మోహ‌న్ బాబు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Mohan Babu : ఇద్ద‌రు హీరోలు కావాల‌ని ట్రోల్స్ చేయిస్తున్నారు.. ఆ రోజు వారికి శిక్ష త‌ప్ప‌ద‌న్న మోహ‌న్ బాబు

Mohan Babu : విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో నాలుగు దశాబ్దాలకుపైగా దక్షిణాది సినిమా పరిశ్రమలో తనకంటూ గొప్ప గుర్తింపును తెచ్చుకొన్న మోహ‌న్ బాబు అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. తాజాగా సన్నాఫ్ ఇండియా చిత్రాన్ని సొంత బ్యానర్‌పై డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.ఈ సినిమా రిలీజ్ నేప‌థ్యంలో మోహ‌న్ బాబు ప‌లు విష‌యాల‌పై కూడా స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు.ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. సాధార‌ణంగా నేను […]

 Authored By sandeep | The Telugu News | Updated on :17 February 2022,6:30 pm

Mohan Babu : విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో నాలుగు దశాబ్దాలకుపైగా దక్షిణాది సినిమా పరిశ్రమలో తనకంటూ గొప్ప గుర్తింపును తెచ్చుకొన్న మోహ‌న్ బాబు అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. తాజాగా సన్నాఫ్ ఇండియా చిత్రాన్ని సొంత బ్యానర్‌పై డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.ఈ సినిమా రిలీజ్ నేప‌థ్యంలో మోహ‌న్ బాబు ప‌లు విష‌యాల‌పై కూడా స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు.ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. సాధార‌ణంగా నేను ట్రోలింగ్స్‌, మీమ్స్‌ను ప‌ట్టించుకోను. ఎవ‌రైనా నాకు పంపిన‌ప్పుడే చూస్తాను. ఎదుటి వారిని ట్రోలింగ్ చేయ‌వ‌చ్చునేమో నాకు తెలియ‌దు కానీ.. వ్య‌గ్యంగా ట్రోల్ చేయ‌డం అనేది బాధాక‌రంగా ఉంటుంది.

ఇద్ద‌రు హీరోలు యాబై నుంచి వంద మందిని ట్రోలింగ్ చేయ‌డానిక‌నే నియ‌మించుకుని ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్లెవ‌రో కూడా నాకు తెలుసు. వారిని ప్రకృతి గ‌మ‌నిస్తోంది. వారికి ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు శిక్ష అనుభ‌విస్తారు. అప్పుడు వారి వెనుక ఎవ‌రూ ఉండ‌రు. ఎవ‌రూ స‌హాయ‌ప‌డ‌రు’’ అన్నారు మోహన్ బాబు.ప్ర‌స్తుతం మోహ‌న్ బాబు చేసిన కామెంట్స్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న ఎవ‌రిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్య‌లు చేశాడా అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. ఇదిలా ఉంటే మా ఎన్నికల్లో గెలిచిన అనంతరం మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు విష్ణు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయవాడలో కలుసుకున్నారు.

mohan babu reacts on trollings and memes

mohan babu reacts on trollings and memes

Mohan Babu : ట్రోల్స్‌పై గ‌రంగ‌రం..

వీరు హఠాత్తుగా కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక రీసెంట్ గా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కూడా మంచు విష్ణు ఇంటికి వచ్చి ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆ విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడగానే విష్ణు తప్పుడు వార్తలపై అప్సెట్ అయ్యాడు.సీఎంతో మీటింగ్ త‌ర్వాత మాట్లాడిన మంచు విష్ణు.. మొన్న జరిగిన చర్చల్లో మిస్ కమ్యూనికేషన్ జరిగిందని అంటూ నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చినప్పటికి కూడా ఆయనకు అందజేయలేదని అన్నారు. ఇక నాన్న గారికి ఇన్విటేషన్ అందకపోవడం పై కూడా ఫిల్మ్ ఛాంబర్ లో చర్చిస్తాం అంటూ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ నాన్న గారు అని అన్నారు. ఇక అలా ఎవరు ఇలా చేశారో మాకు తెలుసని అంటూ ఎలా కరెక్ట్ చేయాలో మేము ఆలోచిస్తామని విష్ణు అన్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది