Allu Arjun : అల్లు అర్జున్ ను హగ్ చేసుకుని ఆనందిస్తున్న స్నేహ రెడ్డి…. ఫొటోస్ వైరల్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : అల్లు అర్జున్ ను హగ్ చేసుకుని ఆనందిస్తున్న స్నేహ రెడ్డి…. ఫొటోస్ వైరల్…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 December 2022,8:40 pm

Allu Arjun : తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ జాబితాలో మొదటిగా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డి ఉంటారని చెప్పాలి. ఇక వీరిద్దరి మధ్య రిలేషన్ తెలియాలంటే వారి సోషల్ మీడియా ఖాతాను చూస్తే చాలు. అల్లు అర్జున్ సంగతి ఏమో కానీ స్నేహ రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన పిల్లల ఫోటోలు అల్లు అర్జున్ ఫోటోలు మాత్రమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలు కూడా తరచూ షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక డ్రెస్సింగ్ స్టైల్ లో అల్లు అర్జున్ కి ఏ మాత్రం తీసిపోదు. భర్తకు గట్టి పోటీ ఇస్తుంది.రకరకాల కాస్టీమ్ లో స్నేహ రెడ్డి ఫోటోలు చూస్తే హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోదని అనిపిస్తుంది. అయితే ఇటీవల స్నేహ రెడ్డికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్నేహ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో నెట్టింటా వైరల్ అవుతుంది. ఇటీవల స్నేహ రెడ్డి తన భర్త అల్లు అర్జున్ తో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటో చూస్తుంటే వీరు వేకెషన్ లో ఉన్నట్లుగా అర్థమవుతుంది.

Sneha Reddy is enjoying hugging Allu Arjun

Sneha Reddy is enjoying hugging Allu Arjun

అయితే న్యూ ఇయర్ వెకేషన్ కోసం అల్లు ఫ్యామిలీ అంతా వెకేషన్ కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ పూర్తిగా అదే గెటప్ లో ఉండాల్సి ఉంది. అయితే తాజాగా స్నేహ రెడ్డి షేర్ చేసిన ఫోటో లో బన్నీని గట్టిగా కౌగిలించుకొని ఉంది. ఇక ఈ ఫోటోలో బన్ని గుబురు గడ్డం మరియు ఒత్తయినా జుట్టుతో ఉన్నాడు. ఇక ఎప్పటి లాగానే ఈ ఫొటోలలో స్నేహారెడ్డి అందంగా కనిపించింది. ఈ ఫోటోను చూసిన సోషల్ మీడియా యూజర్స్ టాలీవుడ్ రొమాంటిక్ కపుల్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది