Nagarjuna : నాగార్జున మన్మధుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే..?

Authored By mallesh | The Telugu News | Published on: January 29, 2022, 6:00 pm

Nagarjuna : అక్కినేని నాగార్జున కెరీర్‌లో ది బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే మన్మధుడు అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అమెరికాలో ఏకంగా 50 రోజులు ఆడిందని చాలా మందికి తెలియదు. కథ విషయానికొస్తే సింపుల్ లవ్ స్టోరీ అయినా కామెడీ మాత్రం అదిరిపోతుంది. దానికి తోడు నాగార్జు, బ్రహ్మానందం మధ్యలో సాగే పంచ్ డైలాగ్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తుంది. ఈ సినిమాలో నాగ్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. ఒకరు సోనాలి బింద్రే కాగా, మరో హీరోయిన్ అన్షు. ఈ అమ్మాయి ప్రభాస్‌తో రాఘవేంద్ర మూవీలోనూ కనిపించింది. ఆ తర్వాత మళ్లీ వెండితెరపై పెద్దగా కనిపించలేదు.

అన్షు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పాత్రల్లో నటించి అందరినీ మెప్పించింది. అన్షు పేరుతో ఎవరూ గుర్తుపట్టకపోయినా ఆమెను చూస్తే చాలు మన్మధుడు హీరోయిన్ అని అందరూ గుర్తుపెట్టుకుంటారు. అందులో ఆమె క్యారెక్టర్ అలాంటిది. ఆ సినిమా నటీనటులకే కాదు. చిత్ర యూనిట్ మొత్తానికి మంచి పేరు తీసుకొచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు డైలాగులు రాశాడు. కాగా, కె విజయ భాస్కర్ మన్మధుడు మూవీకి దర్శకత్వ వహించారు. 2002లో విడుదలైన తెలుగు చిత్రం కన్నడలో ఉపేంద్ర ప్రధాన పాత్రలో ఐశ్వర్యగా రీమేక్ చేయబడింది.

the nagarjuna cupid heroine has changed now

the nagarjuna cupid heroine has changed now

Nagarjuna : అన్షు ఇప్పుడు ఎలా ఉందంటే..

అయితే, అన్షు ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ నుండి అదృశ్యమైంది. ప్రశాంత్ (జీన్స్ ఫేమ్) నటించిన తమిళ చిత్రం జైలో పని చేసిన ఆమె.. చివరికు తన జన్మస్థలమైన లండన్‌కు తిరిగి వెళ్లి అక్కడ తన విద్యను అభ్యసించింది. ఆ తర్వాత సచిన్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని యూకేలో స్థిరపడింది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. అన్షు ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తోంది. ఆమె తన స్వంత డిజైనర్ లేబుల్ ఇన్‌స్పిరేషన్ కోచర్‌ని కూడా కలిగి ఉంది. ఇక మన్మధుడు సినిమాలో అన్షు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp