Diabetes : డయాబెటిస్ తో బాధపడుతున్నారా.? వీటిని తిని హ్యాపీగా ఉండండి..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 January 2023,7:40 am

Diabetes : ఇప్పుడు ఉన్న కాలంలో వయసు తరహా లేకుండా షుగర్ వ్యాధి చాలామందిని వేధిస్తూ ఉన్నది. ఈ షుగర్ సమస్య నుండి రక్షణకు మెడిసిన్ ఎంత ముఖ్యమో అదేవిధంగా ఆహార అలవాట్లు తో షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చని కూడా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. వాళ్లు చెప్పే ఆహారం ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. చాలామందికి వంశపారపర్యంగా షుగర్ సమస్య వస్తుంది. కొంతమందికి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిన్న వయసులోనే ఈ సమస్య వస్తుంది. ఒకసారి షుగర్ వస్తే దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే జీవితాంతం మెడిసిన్ వాడవలసి వస్తుంది. చాలామంది టాబ్లెట్లు లెవెల్స్ పోయి ఏకంగా ఇన్సులిన్ ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కడుపునిండా తినాలన్న ఆందోళన చెందుతున్నారు. అయితే వీరు తప్పకుండా శారీరకం వ్యాయామం చేయాలి. ఒక్కొక్కసారి తినడం కొంచెం ఆలస్యమైనా వెంటనే నీరసం వచ్చేస్తూ ఉంటుంది.

కాబట్టి ఇటువంటి బాధలు ఎన్నో షుగర్ వ్యాధిగ్రస్తులు పడుతూ ఉంటారు. అలాగే షుగర్ సమస్య నుండి బయటపడడం కోసం మెడిసిన్ ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం అని నిపుణులు తెలియజేస్తున్నారు.. ఆ ఆహారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. ధనియాలు : ధనియాలు రక్తంలోనే షుగర్ ను కంట్రోల్ చేసే ఎంజిఎంఎల్ ను సత్యం చేయడం వలన గ్లూకోజ్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ : పులియబెట్టిన ఎస్టి ఆసిడ్ ఇన్సులిన్ ని సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా రక్తంలో షుగర్ లెవెల్స్ ని ప్రతిస్పందనను 20% తగ్గించడానికి ఉపయోగపడుతుంది.. కూరగాయలు : కూరగాయలలో తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ తో ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను గణనీయంగా తగ్గిస్తుంటాయి. వంకాయ, గుమ్మడికాయ, పచ్చిబఠానీ, క్యారెట్, పొట్లకాయ, టమాట లాంటివి ఆరోగ్యకరమైన కూరగాయాలని

Are you suffering from diabetes

Are you suffering from diabetes

కచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి.. వెల్లుల్లి : వెల్లుల్లి తీసుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకి గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇది షుగర్ ఉన్నవాళ్లు బ్లడ్ షుగర్ ఇంఫ్లమేషన్ ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచుతుంది. అదేవిధంగా రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తుంది.. చియా గింజలు : చియ్య గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడంతో షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది. ఫ్రూట్స్ : నిర్దిష్టమైన ఫ్రూట్స్ను నిత్యం తీసుకోవడం రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ప్రధానంగా ఆపిల్ ద్రాక్ష స్ట్రాబెరీ లాంటి ఫ్రూట్స్ను తీసుకుంటే టైప్ టు డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చు.. తృణధాన్యాలు బార్లీ, ఓట్స్, కిన్నోవా లాంటి త్రోణదాన్యాలు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ ఉంచడంలో ఉపయోగపడతాయి. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు నిత్యం తృణధాన్యాలు తీసుకుంటే మేలు జరుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు..

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి