Medicinal Plants : వర్షాకాలంలో ఈ మొక్కల్ని మీ ఇంట్లో పెంచుకోండి… అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Medicinal Plants : వర్షాకాలంలో ఈ మొక్కల్ని మీ ఇంట్లో పెంచుకోండి… అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం…?

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Medicinal Plants : వర్షాకాలంలో ఈ మొక్కల్ని మీ ఇంట్లో పెంచుకోండి... అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం...?

Medicinal Plants : కొన్ని శతాబ్దాల కాలం నుంచి ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాలు చికిత్సకు మెడిసిన్ గా వాడుతూ వస్తున్నారు. ఇవన్నీ శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి మొక్కల్ని మన ఇంట్లో పెంచుకుంటే, ఆయుర్వేద ఔషధ మొక్కలు వాటితో కలిగే ఆరోగ్య సులభంగా పొందవచ్చు. అలాంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఏమిటో.. వాటిలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.. ప్రకృతి ఎన్నో రకాల మొక్కలను అందిస్తుంది. ఔషధ గుణాలు కలిగిన ఆయుర్వేద మొక్కలు కూడా ఉంటాయి. శతాబ్దాల కాలం నుంచి ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాల చికిత్సలకు వినియోగిస్తున్నారు. శరీర ఆరోగ్యాన్ని కాపాడుటకు వాటిలో కొన్నిటిని మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. వర్షాకాలంలో ఇంట్లో సులువుగా పెంచుకోగలిగే,ఆయుర్వేద ఔషధ మొక్కలు,వాటితో కలిగారు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

Medicinal Plants వర్షాకాలంలో ఈ మొక్కల్ని మీ ఇంట్లో పెంచుకోండి అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం

Medicinal Plants : వర్షాకాలంలో ఈ మొక్కల్ని మీ ఇంట్లో పెంచుకోండి… అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం…?

Medicinal Plants పుదీనా

పుదీనా ఆకులు,వీటి వాసన చూస్తే మైండ్ అంతా రిఫ్రెష్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సువాసనతో కూడిన పుదీనాని వాడుతుంటారు. పుదీనా ఆకులని వంటల్లో రుచి కోసమే కాదు,ఆరోగ్యానికి కూడా దివ్య ఔషధం. మంచి వాసనను కూడా అందిస్తుంది. ఇంకా,టేస్టును పెంచుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ ఆకులని ప్రతిరోజు మన ఆహారంలో చేర్చుకున్నట్లైతే, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, టీ,స్వీట్లు,మొదలైన వాటికి రుచి సువాసన కోసం దీన్ని కలుపుతారు.ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం సమస్యలను తగ్గిస్తుంది.

కరివేపాకు : కరివేపాకు వంటల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. కరివేపాకు ఆకులలో కాల్షియం,మెగ్నీషియం, ఐరన్,ఫాస్ఫరస్,జింక్, ఫీచు పోషకాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి,విటమిన్ ఇ, లు అధికంగా ఉంటాయి. దీనిని ప్రతి ఆహారాల్లో చేర్చుకున్నట్లయితే దీని ప్రయోజనాలను పొందవచ్చు. కరివేపాకును పప్పు,సాంబార్ వంటి వంటకాలలో ఎక్కువగా వాడుతుంటారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇది సరైన ఆహారం. ఇంకా, నాడీ సంబంధిత వ్యాధుల్ని, క్యాన్సర్ వంటి వ్యాధుల్ని అడ్డుకోగలదు. ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

లెమన్ గ్రాస్ : లెమన్ గ్రాస్ సువాసనతో నిండి ఉంటుంది. దీన్ని టీ,సూపు, థాయ్ వంటకాలలో వాడుతారు. ఈ మొక్క ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్, ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా నుండి శరీరాన్ని రక్షించగలదు. లెమన్ గ్రాసులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. లెమన్ గ్రాస్ లో అనేక పోషకాలు ఉంటాయి. శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ ను పటిష్ట పరుస్తుంది. రోగాలతో పోరాడే శక్తి ఉంటుంది.

గిలోయ్ : రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలకు ప్రసిద్ధి చెందినది గిలోయ్. ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది తిప్పతీగలో యాంటీ ఫంగల్ యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వీటిని మెడిసిన్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. గిలోయ్ అంటే తిప్పతీగ. ఈ ఆకులను రోజుకు రెండుసార్లు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి భాగవృద్ది చెందుతుంది.రోగాల బారిన పడకుంటా కాపాడుతుంది. డయాబెటీస్ సమస్యలను నివారిస్తుంది. తిప్పతీగ చూర్ణం ప్రతి రోజు ఉదయం,సాయంత్రం తీసుకుంటే, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.

తులసి : హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క అందరి ఇంటి ముంగట ఉంటుంది. హిందువులు తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈరోజు తులసి చెట్టుకు నీరు పోసి ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగిస్తే చాలా మంచిదాన్ని నమ్ముతారు. చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందని భక్తుల నమ్మకం అయితే తులసి మొక్క కేవలం మతపరమైన ప్రాముఖ్యతలకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అనేక ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులు అంటే, దగ్గు, జ్వరం, జలుబు వంటివి రాకుండా చేస్తుంది.అలాగే జీవక్రియను మెరుగుపరుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది