Health Problems : అధికంగా వీరిపై ఇన్ ఫ్లూ యెంజా ఎఫెక్ట్ … ఇది ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 March 2023,7:00 am

Health Problems : ప్రస్తుతం చాలామంది ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.. ఇది సీజనల్ ఇన్ ప్లూ ఎంజా . వల్ల వచ్చే జ్వరాలు అని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం విజృంభిస్తున్న హాంకాంగ్ ప్లూ హెచ్ 3 ఎన్ టు వైరస్ మార్చి నెల ఆఖరి నుంచి తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఈ వైరస్ వలన తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఏర్పడుతున్నాయి… కరోనా సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా బయటపడక ముందే దేశంలోని ఇన్ ప్లూ యొంజ వైరస్ బాగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ కేసులు చాప కింద నీరుల విస్తరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడు ఒక వార్తను విడుదల చేశారు..

Health Problems Influenza effect on them more

Health Problems Influenza effect on them more

హెచ్ 3 ఎన్ టు సహా సీజనల్ ఇన్ ప్లూ యోంజ నుంచి వచ్చి కేసులు మార్చి చివరన తగ్గుముఖం పడతాయని కేంద్ర ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది భారతదేశం కాలానుగున ఇన్ ప్లూ ఎంజా రెండు సీజన్లో వ్యాపిస్తుంది. మొదటిది జనవరి నుంచి మార్చి వరకు రెండోది రుతుపవనాల అనంతర కాలంలో సీజనల్ వైరస్ల వల్ల వచ్చే కేసులను పేర్కొనడం జరిగింది. ఈ బ్లూ వైరస్ల వల్ల తీవ్రమైన శ్వాస కోసం ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ వైరస్ ప్రపంచంలోనే అన్ని ప్రాంతాలలో విశ్రమిస్తుంది. కొన్ని నెలల్లో కేసులు పెరుగతాయని కూడా తెలిపారు. ఎటువంటి వారిపై ఈ వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంటే… సీజనల్ ఇన్ ప్లూ ఎంజ వ్యాపిస్తున్న క్రమంలో చిన్న పిల్లలు, వృద్దులు ఇప్పటికే ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రమాదం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Influenza prevention and control | OpenWHO

 

ఈ క్రమంలో మంత్రిత్వ శాఖ రోగులు వర్గీకరణ చికిత్స ప్రోటోకాల్ కేంద్ర రాష్ట్రాలకు వెంటిలేటర్ నిర్వహణపై మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నియమ నిబంధనలు కేంద్రమంత్రి శాఖ వెబ్ సైట్ (www.mohifw.nic) లో అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పడం జరిగింది. ఈ వైరస్ నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఓసేల్టా మివిర్ అనే టీకాను వెయ్యవలసి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఔషధం.

పబ్లిక్ హెల్త్ సిస్టం ద్వారా ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. ఫిబ్రవరి 2017లో డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ షెడ్యూల్ హెచ్ వన్ ప్రకారం ఈ వ్యాక్సిన్ అమ్మకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చారు. ఫిబ్రవరి 28 వరకు మొత్తం 955 హెచ్ వన్ ఎన్ వన్ కేసులు నమోదయ్యాయి.. పంజాబ్ 28, కేరళ 42, గుజరాత్ 74, మహారాష్ట్ర 170 తర్వాత తమిళనాడు 545 హెచ్ వన్ ఎన్ వన్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక హర్యానాలలో h2n2 వైరస్తో ఒక్కొక్కరు మరణించడం జరిగింది.. అయితే ఈ వైరస్ ప్రభావం మార్చి నెల చివరలో తగ్గి అవకాశం ఉన్నది..

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి