సీఎం జ‌గ‌న్ పంపిన‌ ఎమ్మెల్సీ జాబితాకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

Authored By Admin | The Telugu News | Published on: June 14, 2021, 9:51 pm

ap governor గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పంపిన జాబితాను రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ap governor ఆమోద‌ముద్ర‌వేశారు. గ‌వ‌ర్న‌ర్ కోటాలో మోషేన్ రాజా , లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, ర‌మేష్ యాద‌వ్ ఎమ్మెల్సీలుగా ఏపీ ప్ర‌భుత్వం గ‌త‌వారం పంపింది. ఈ జాబితాను రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ap governor ఆమోదం తెలిపారు. అయితే ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గ‌వ‌ర్న‌ర్ తో 40 నిమిషాలు భేటి అయినారు.

ap governor approves four mlcs

ap governor approves four mlcs

ఆ భేటీ ముగిసిన కొద్ది సేప‌టికే గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఆ నాలుగురి పేర్ల‌ను ఆమోదం తెలిపారు.ఈ నెల 11వ తేదీన గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం పూర్తైంది.టీడీపీకి చెందిన గౌనిగాని శ్రీ‌నివాలు నాయుడు, పి. శ‌మంత‌క‌మ‌ణి, టీడీ జ‌నార్థ‌న్‌, బీద ర‌విచంద్ర‌యాద‌వ్‌ల ప‌ద‌వీకాలం ముగిసింది. అందులో ముగ్గురు టీడీపీలోనే ఉండాగా, పి. శ‌మంత‌క‌మ‌ణి మాత్రం వైసీపీలో చేరింది. వీళ్ల ప‌ద‌వీకాలం ముగియ‌డంతో కొత్త గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీల పేర్ల‌ను నామినేటేడ్ చేయాల్సి వ‌చ్చింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : ఆ విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌నున్న‌ వైఎస్ జ‌గ‌న్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==> YSRCP : అక్కడ వైసీపీకి నిఖార్సయిన నాయకుడు కావాల్సిందే?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : సీఎం జ‌గ‌న్‌పై వాళ్లంతా సీరియ‌స్‌గా ఉన్నారంటా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Sonu Sood : వైఎస్సార్సీపీ సోనూసూద్ తో పెట్టుకుంటోందేంటి…?

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp