" రంగస్థలం " సీక్వెల్ ప్లాన్ లో సుకుమార్ .. ప్రెసిడెంట్ గా రాం చరణ్ ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

” రంగస్థలం ” సీక్వెల్ ప్లాన్ లో సుకుమార్ .. ప్రెసిడెంట్ గా రాం చరణ్ ..?

రంగస్థలం సినిమా టాలీవుడ్ లో ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా – అక్కినేని సమంత హీరోయిన్ గా నటించింది. సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రంగస్థలం రాం చరణ్ తో పాటు సుకుమార్, సమంత ల కెరీర్ లో కూడా ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోతుందనడం లో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు స్టైలిష్ చిత్రాలు […]

 Authored By govind | The Telugu News | Updated on :1 January 2021,12:16 pm

రంగస్థలం సినిమా టాలీవుడ్ లో ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా – అక్కినేని సమంత హీరోయిన్ గా నటించింది. సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రంగస్థలం రాం చరణ్ తో పాటు సుకుమార్, సమంత ల కెరీర్ లో కూడా ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోతుందనడం లో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు స్టైలిష్ చిత్రాలు తీసి సూపర్ హిట్స్ అందుకునే సుకుమార్ ఫస్ట్ టైం కల్ట్ కంటెంట్ తో రంగస్థలం సినిమా తీసి ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు.

Rangasthalam Latest USA Box Office Collection: Ram Charan film at 3rd Place  - tollywood

రంగస్థలం చూసిన స్టార్ హీరోలందరూ సుకుమార్ ని ఏమడిగారో తెలుసా ..?

ఈ సినిమా చూసిన చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు రంగస్థలం లాంటి కథ చెప్పమని సుకుమార్ ని కోరారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడిగా సుకుమార్ కి హీరోగా అల్లు అర్జున్ కి ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు సుకుమార్.

Fans decode Allu Arjun's Pushpa posters and discover hints | Telugu Movie  News - Times of India

ఈ సినిమా కథ కూడా ఇలాంటి కల్ట్ కంటెంట్ తోనే తెరకెక్కబోతుందని చెప్పుకుంటున్నారు. కాగా ఇప్పుడు సుకుమార్ రంగస్థలం సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రాం చరణ్ ప్రెసిడెంట్ గా నటిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా వినిస్తోంది. ప్రెసిడెంట్ గా రాం చరణ్ పాత్ర చాలా హుందాగా ఉంటుందని.. ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాని రాం చరణ్ సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తారని సమాచారం.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది