Adilabad..స్వర్ణ జలాశయాన్ని సందర్శించిన కలెక్టర్

Authored By praveen T | The Telugu News | Updated on : 7 September 2021, 8:45 pm

భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంటున్నది. వాగులు, వంకలు నీటితో పొర్లిపోతున్నవి. జిల్లాలోని సారంగపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలోకి వరద నీరు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఓపెన్ చేసి వాటి ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్వర్ణ జలాశయాన్ని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కాడేతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు అధికారులతో జలాశయ నీటి మట్టం గురించి, వదులుతున్న నీటి గురించి మాట్లాడారు.

ఈ క్రమంలోనే స్వర్ణ వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాక ముందరే ఆ ప్రాంతాలను ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలని తెలిపారు. అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇకపోతే జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు జనాలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.

 

praveen T

No bio available for this author.

  1. "Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా ?.. వైరల్ అవుతున్న ధనరాజ్ భార్య వ్యాఖ్యలు.."

  2. "Udhayanidhi Stalin : త్రిష వివాదంలో ఉదయనిధికి లీగల్ షాక్.. కేసు నమోదు, తమిళనాడులో రాజకీయ రగడ.."

  3. "Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఘటన .. వ్యక్తిగత ఫోటోల లీక్ .. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లతో మహిళకు నరకం"

  4. "YS Jagan : 2029 లక్ష్యంగా జగన్ మాస్టర్ ప్లాన్.. వైసీపీలో భారీ మార్పులకు శ్రీకారం?"

  5. "New pensions : లబ్ధిదారులకు శుభవార్త .. ఆగస్టు 15 నుంచి 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు.. ఎవరికెవరికీ వస్తాయంటే?"

  6. "Rice price : ప్రజలకు గుడ్ న్యూస్.. ఆధార్ ఉంటే చాలు..తక్కువ ధరకే బియ్యం.. ఎక్కడ దొరుకుతుంది? ఎలా కొనాలి? వివరాలివే.."

  7. "Karthika Deepam 2 Today Episode August 04 : సూరజ్‌పై జ్యోత్స్న ఆగ్రహం.. పెళ్లి ఆపేందుకు కుటుంబంలో కొత్త డ్రామా!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp