Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి…!

Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నటువంటి ఉచ్చుకత ఏదైతే ఉందో అది చాలా షాకింగ్ గా అనిపిస్తుంది అని చెప్పాలి. అయితే తెలంగాణలో ఎంపీ సీట్లు సాధించాలి అనుకోవడం లేదా కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వంటి వాటిలో సాధించాలనుకుంటే ఎన్ని ప్రయత్నాలు అయినా చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం సాధించడానికి ఇంతలా ఎగబడుతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న.అయితే నిజానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిలను రంగంలోకి దించడమే […]

 Authored By aruna | The Telugu News | Updated on :17 February 2024,4:30 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి...!

Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నటువంటి ఉచ్చుకత ఏదైతే ఉందో అది చాలా షాకింగ్ గా అనిపిస్తుంది అని చెప్పాలి. అయితే తెలంగాణలో ఎంపీ సీట్లు సాధించాలి అనుకోవడం లేదా కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వంటి వాటిలో సాధించాలనుకుంటే ఎన్ని ప్రయత్నాలు అయినా చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం సాధించడానికి ఇంతలా ఎగబడుతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న.అయితే నిజానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిలను రంగంలోకి దించడమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద విజయం అని చెప్పాలి. ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి వంటి గొప్ప నాయకుడి బిడ్డని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేయగలడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం.ఇక ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా సాధిస్తే షర్మిలనే సాధించాలి . కానీ ఇప్పుడు అలా కాకుండా కొత్త ఎత్తుగడలతో ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్ అవుతుందని తెలుస్తోంది. అయితే దీని వెనక ఎవరు ఉన్నారు…?వీరిని ఎవరు నడిపిస్తున్నారు…? ఇంత ఉత్సాహంగా ఎందుకు పరుగులు పెడుతున్నారు అనే అంశాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం.

రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించడానికి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఏ రకమైనటువంటి బాధ్యతలు చేపడతారు అంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన అధ్యక్షుడు కాదు మరి ఏమీ కాదు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే. అలాంటి వ్యక్తి ఏపీలో ఏం చేయగలుగుతారు అంటే ఒక స్ట్రాంగ్ ప్రచార సభలను తీసుకువచ్చి కనీసం 7 నుంచి 8 శాతం ఓట్ బ్యాంకింగ్ పెంచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక దానిలో భాగంగానే వైయస్ షర్మిల ను వారు రంగంలోకి దించడం జరిగింది. వైయస్ షర్మిల కూడా ప్రస్తుతం బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. తన అన్న జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక వైయస్ షర్మిల అడుగుతున్నటువంటి విధానం పద్ధతి చూస్తే ఎవరైనా శభాష్ అనాల్సిందే. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని ఎందుకు విలీనం చేసింది అనే దానికి మాత్రం షర్మిల వద్ద సమాధానం లేదు.

కానీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని ప్రశ్నించడంలో మాత్రం ఆమె చాలా యాక్టివ్ కనిపిస్తుంది. ప్రతి సభలో మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి వైయస్ జగన్ చేయలేకపోయారని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలను షర్మిల ఆడడం జరిగింది.దీంతో షర్మిలపై మరియు కాంగ్రెస్ పార్టీపై పాజిటివ్ వేవ్ నడుస్తుందని చెప్పాలి . ఇక ఇలాంటి తరుణంలో రాబోయే ఎన్నికల్లో ప్రచారాలకు పూర్తి బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే గనక నిజమైతే ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డికి కూతురుగా వచ్చినటువంటి షర్మిలకు ఇప్పుడు తోడుగా చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి జాయిన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదే గనక జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు కచ్చితంగా పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది