Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: August 7, 2025, 8:00 am
  •  Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !

Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు – సోదరి మధ్య బంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కడుతూ, వారిని రక్షణగా కోరుతారు. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 9, 2025 (శనివారం) న జరుపుకోనున్నారు. విశేషం ఏమిటంటే, 95 ఏళ్ల తర్వాత అంటే 1930లో ఏర్పడిన శుభయోగాలు ఈ ఏడాది మళ్లీ కలిసొస్తున్నాయి. ఇదే తేదీ, ఇదే తిథి, అదే నక్షత్రం, అదే యోగాలు కలసి రావడం ఇదో అరుదైన సందర్భంగా పరిగణించవచ్చు.

Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !

Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !

Raksha Bandhan : అరుదైన తేది..

రాఖీ పండుగ ప్రత్యేకతలు చూస్తే.. శ్రావణ పౌర్ణమి తిథి ప్రారంభం: ఆగస్టు 8, మధ్యాహ్నం 2:12 గంటలకు, ముగింపు: ఆగస్టు 9, మధ్యాహ్నం 1:24 గంటలకు. ఇక భద్ర కాలం ప్రారంభం: ఆగస్టు 8, మధ్యాహ్నం 2:12 గంటలకు, ముగింపు: ఆగస్టు 9, తెల్లవారుజామున 1:52 వరకు ఉంటుంది. రాఖీ కట్టడానికి శుభ సమయం – ఆగస్టు 9న ఉదయం 5:21 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు .ఈ రాఖీ పండుగ రోజు అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి.

సౌభాగ్య యోగం – ఆగస్టు 9న ఉదయం నుంచి ఆగస్టు 10 తెల్లవారుజామున 2:15 వరకు. శోభన యోగం – సౌభాగ్య యోగం తరువాత ప్రారంభమవుతుంది. సర్వార్థ సిద్ధి యోగం – ఆగస్టు 9 ఉదయం 5:47 నుండి మధ్యాహ్నం 2:23 వరకు, శ్రావణ నక్షత్రం – మధ్యాహ్నం 2:23 వరకు, దీనితో పాటు కరణం, బవ, బాలవ కలయిక యాదృచ్చికంగా సంభవించాయి. ఇలాంటి శుభయోగాలలో లక్ష్మీ-నారాయణ పూజ చేసి, రాఖీ కడితే మంచి ఫలితాలు లభిస్తాయని విశ్వాసం ఉంది. 1930లో కూడా రాఖీ పండుగ ఆగస్టు 9న, శనివారం రోజునే వచ్చింది .అదే తిథి, అదే యోగాలు, అదే నక్షత్రం, అదే కరణాలు ఏర్పడ్డాయి, కేవలం 5 నిమిషాల తేడాతో పౌర్ణమి తిథి ప్రారంభమైంది. అప్పట్లో కూడా సౌభాగ్య యోగం, శ్రావణ నక్షత్రం ఉండటంతో ఈ సంవత్సరంతో అదే శుభం కలిగి ఉంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp