బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి ఛీఫ్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు ..!

 Authored By govind | The Telugu News | Updated on :7 December 2020,9:30 pm

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 తుది దశకు చేరుకుంది. టాలీవుడ్ మన్మధుడు.. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇక సీజన్ 4 గ్రాండ్ ఫినాలే కి దగ్గర పడింది. కాగా ఈసారి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గ్రాండ్ లెవల్ లో ఉండబోతోంది. ఈ గ్రాండ్ ఫినాలే కి సూపర్ స్టార్ మహేష్ బాబు ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని స్టార్ మా వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Mahesh Babu to host Bigg Boss Telugu 4? - tollywood

గత సీజన్ గ్రాండ్ ఫినాలే కి మెగాస్టార్ చిరంజీవి వచ్చిన సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫినాలే ఫైనల్ ఎపిసోడ్ లో నాగార్జున – చిరంజీవి కలిసి స్టేజ్ మీద కనిపించగానే ప్రేక్షకుల ఆనందాలకి అవధులు లేకుండా పోయాయి. ఈ ఎపిసోడ్ కి రేటింగ్ కూడా ఊహించని విధంగా వచ్చింది. అందుకే ఈసారి అంతకు మించి భారీ లేవల్ లో ఉండేలా ప్లాన్ చేసిన బిగ్ బాస్ నిర్వాహకులు సూపర్ స్టార్ మహేష్ ని ఆహ్వానించారని తెలుస్తోంది.

Nagarjuna Shoots Special Promo For Bigg Boss Telugu 4? - Filmibeat

ఇక మహేష్ బాబు కూడా నాగార్జున తో ఉన్న అనుబంధం కారణంగా గ్రాండ్ ఫినాలే కి వచ్చేందుకు ఒప్పుకున్నాడని చెప్పుకుంటున్నారు. అంతేకాదు మరికొన్ని ఊహించని సర్‌ప్రైజెస్ కూడా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. కాగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అఖిల్ అన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

govind

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి