Manchu Family : మంచు వారి ఆ ఒక్క మాటతో మొత్తం ట్రోలర్స్‌ సైలెంట్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :21 February 2022,2:30 pm

Manchu Family : మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణు ల పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్‌ తారా స్థాయికి చేరాయి. ఇటీవల విడుదలైన సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రచారం తో మీమ్స్ మరియు విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. అదిగో ఇదిగో అంటూ మంచు ఫ్యామిలీ పరువు తీసే విధంగా అత్యంత దారుణంగా కొందరు వ్యవహరిస్తున్నారు. కొందరు ఆరోగ్యకరమైన విమర్శలు చేస్తుంటే మరి కొందరు మాత్రం దారుణంగా విమర్శలు చేస్తూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ఒక సినిమా బాలేదంటే చూడకుండా వదిలేయాలి.. లేదంటే విమర్శించాలి.. అదీ కాదంటే నెగిటివ్ ప్రచారం చేసేవారు కూడా ఉంటారు అంతేగాని మరీ దారుణంగా వ్యక్తిగత దూషణలకు దిగడం మాత్రమే కాకుండా కుటుంబం మొత్తం ను విమర్శించడం వంటి కార్యక్రమాలు చేయడం ఏమాత్రం సబబు కాదు.

మంచు ఫ్యామిలీ పై చేసిన విమర్శలు తార స్థాయికి చేరడంతో ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో మంచు ఫ్యామిలీ విమర్శలు చేస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రతి ఒక్కరు విమర్శలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించింది. పరువు నష్టం దావా వేస్తానంటూ నోటీసులు కూడా జారీ చేయడంతో ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయారు. సోషల్ మీడియా మరియు వెబ్ మీడియా లో ఇంతకు ముందు పోస్ట్ లు మరియు విమర్శలు అన్నీ కూడా డిలీట్ అయ్యాయి. మంచు ఫ్యామిలీ అనుకున్నది చేసే రకమే అనే ఉద్దేశంతో వెంటనే సోషల్ మీడియాలో సన్ ఆఫ్ ఇండియా ట్రోల్స్ కి పులి స్టాప్ పడింది.

trolls on manchu family stopped due to legal notice

trolls on manchu family stopped due to legal notice

మరో వైపు మంచు ఫ్యామిలీ ని సమర్ధించేవారు కూడా ఆ విమర్శలు చేసే వారిపై ఎదురు దాడికి దిగారు. ఇలా రెండు ఒకేసారి జరగడంతో మంచు ఫ్యామిలీ పై జరుగుతున్న సోషల్ దాడి కి బ్రేక్ పడ్డట్లయింది. ముందు ముందు ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంచు ఫ్యామిలీ పై ఉంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు గౌరవిస్తూ ప్రతి ఒక్కరితో గౌరవింపబడే అది గొప్ప విషయం. మంచు ఫ్యామిలీ కూడా ఈ విషయాన్ని ఫాలో అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మంచు ఫ్యామిలీ విషయంలో ఇకపై సోషల్‌ మీడియాలో ఆ స్థాయి విమర్శలు ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ముందు ముందు ఎలా జరుగుతుందో చూడాలి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి