Cat : అయ్యో..! పిల్లి గోళ్లకి ఒక యువకుడి ప్రాణం బలయింది…. ఎలానో తెలుసా…?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 22 February 2025, 9:40 am
  •  Cat : అయ్యో..! పిల్లి గోళ్లకి ఒక యువకుడి ప్రాణం బలయింది.... ఎలానో తెలుసా...?

Cat : ఇంట్లో పెంపుడు జంతువులని ఇష్టంగా పెంచుకుంటాం. అయితే ఆ పెంపుడు జంతువులకి కాళ్ళకి చేతులకి గోర్లు ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించి వేయాలి. లేకుంటే ఆ గోర్ల వల్ల విషం మనకి ప్రమాదాన్ని తెస్తుంది. వాటికి గోర్లలో విషం ఉంటుంది. అవి మనల్ని గిరినప్పుడు ఇన్ఫెక్షన్స్ అయ్యి. చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అవునా పెంపుడు జంతువులను పెంచేటప్పుడు జాగ్రత్తలను పాటించాలి. అయితే ఇటువంటి సంఘటన మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. షాహ్ డోల్ జిల్లాలో అమలై ప్రాంతంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 22 సంవత్సరాల యువకుడు మరణించాడు. ఆ యువకుడి ఆరోగ్యం క్షీణించడంతో కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడు. పిల్లి గోర్లతో ఆ యువకుడిని గీరడం చేత యువకుడు గాయపడ్డాడు. ఆ యువకుడు దీనిని పట్టించుకోలేదు అని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

Cat : అయ్యో..! పిల్లి గోళ్లకి ఒక యువకుడి ప్రాణం బలయింది.... ఎలానో తెలుసా...?

Cat : అయ్యో..! పిల్లి గోళ్లకి ఒక యువకుడి ప్రాణం బలయింది…. ఎలానో తెలుసా…?

Cat  పెంపుడు జంతువులను పెంచుకునేవాళ్లు ఇవి  గుర్తుపెట్టుకోవాలి

అయితే చాలామందికి కూడా ఇంట్లో కుక్కలని మరియు పిల్లుని పెంచుకోవడం ఇష్టం. పెంపుడు జంతువులను పెంచుకోవాలి అనుకునేవారు కొన్ని విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు పెంపుడు కుక్కలైనా లేదా పిల్లులైనా మనల్ని గోళ్ళతో రెక్కిన లేదా కొరికిన.. దీన్ని మాత్రం ఎప్పుడూ కూడా తేలిగ్గా తీసుకోకండి… ఎందుకంటే మధ్యప్రదేశ్లో షాడోల్లో ఒక యువకుడు దీనిపై నిర్లక్ష్యంగా ఉండడం చేత ప్రాణాలు కోల్పోయాడు. పిల్లి ఆ యువకుడుని గోళ్ళతో రక్కింది. యువకుడు ఏమీ కాదులే అని, తేలిగ్గా తీసి పడేసాడు. తరువాత కొన్ని రోజులకి ఆయనకు ఆరోగ్యం క్షీణించి మరణించాడు.
ఇటువంటి సంఘటన షాహ్ డోల్ జిల్లాలోని అమలై పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ చీఫ్ హౌస్ లో నివసిస్తున్న 22 ఏళ్ల దీపక్ కోల్ అనే యువకుడిని చికిత్స కోసం SECL సెంట్రల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స సమయంలో, దీపక్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దాంతో అతన్ని షాడోల్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తుండగానే దీపక్ మరణించడం జరిగింది. దీపకు మరణానికి గల కారణాలు ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడ లేదు. మీ కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతికర విషయాలను వెల్లడించారు.

దీప కుటుంబం ప్రకారం, అతడి ఇంటికి తరచూ ఒక పిల్లి వచ్చేదని, రోజు ఆ పిల్లి దీపక్ పై దాడి చేసి అతని గోలతో గీరింది. పిల్లి గోల వల్ల దీపక్ గాయపడ్డాడు. కానీ అతడు దానిని అంత సీరియస్ గా తీసుకోలేదు. సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత, దీపక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం ప్రారంభమైంది. అయితే అప్పుడు అతడు చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ చికిత్స తీసుకుంటూనే మధ్యలోనే మరణించాడు. ఆరోగ్యం క్షీణించి పిల్లి గొల్ల వలనే అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, అదే సమయంలో, యూపీలోని బరేలి నుండి ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, పెంపుడు పిల్లి కరిచి తర్వాత ఐదు సంవత్సరాల పిల్లవాడికి రేబిస్ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నారు.ARV ఇవ్వకపోతే, అతడికి రేబిస్ అది వచ్చే అవకాశం ఉంది. హైడ్రో, యు ఎరో ఫోబియా లక్షణాలతో వైద్యులు అయోమయంలో పడ్డారు. అయితే జిల్లాలో తొలిసారిగా పెంపుడు జంతువు కాటుకు గురైన అనుమానస్పద కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఆ పిల్లవాడికి రేబిస్ ఉందని నిర్ధారించడానికి లక్నోలోని KGM కు రిఫర్ చేశారు. ఏదైనా పెంపుడు జంతువు లేదా వీధి జంతువు కాటు లేదా గోల దాడికి గురైతే మాత్రం వెంటనే ARV తీసుకోవడం అవసరమని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇది వెంటనే చేయకపోతే, ఇన్ఫెక్షన్ శరీరంలో వ్యాప్తి చెందుతుంది. లేకుంటే పరిస్థితి మరింత త్రివ్రంగా మారవచ్చు అని చెబుతున్నారు వైద్యులు.

నిజానికి, నాలుగు రోజుల క్రితం సిఫాన్ ప్రవర్తనలో మార్పు కనిపించిందని పిల్లాడి తల్లి శాలు సెల్ఫీ చెప్పారు. అతడు చిరాకు పడటం, కోపంతో వస్తువులను విసరడం మొదలుపెట్టాడు. బుధవారం రాత్రి అతని పరిస్థితి మరింత విషమించింది. ముందు నీళ్లు పెట్టినప్పుడు, షాన్ నుండి గాలి తగిలినప్పుడు అతను భయపడి బిక్కరగా ఏడవడం ప్రారంభించాడు. కుటుంబ సభ్యులు భయపడిపోయి అతని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఇక్కడి నుండి వెంటనే బరేలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత, బరేలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడు సిఫానును పరీక్షించి, అతనిలో హైడ్రోఫోబియా ( నీటి భయం ) మరియు ఏరోఫోబియా ( గాలిబయం ) లక్షణాలను వారు గమనించారు. అయితే ఈ రెండు లక్షణాలు రేబిస్ ఇన్ఫెక్షన్లలో కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. అయితే బాలుడికి నిరంతరం చొంగ కారుతూనే ఉంది. అతను దూకుడుగా ప్రవర్తిస్తున్నాడు. ఆలోచించే విధానంలో కూడా ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. ఎద్దుల కుటుంబ సభ్యులను ప్రశ్నించినప్పుడు, నేల క్రితం సిఫానును పెంపుడు పిల్లి కరిచిందని వెల్లడయ్యింది. కానీ విషయం తీవ్రత ఎవరికి తెలియదు. పిల్లవాడికి ఎలాంటి టీకాలు వెయ్యలేదు. లికి కూడా ఎలాంటి టీకాలు వేయించలేదు. బాలుడికి రేబిస్ సోకడానికి ఇదే కారణం అంటున్నారు వైద్యులు. అందుకే పిల్లి అయినా, కుక్క అయినా ఎటువంటి పెంపుడు జంతువులు అయినా సరే.. గోళ్లు తోటి గీరినా, కరిచినా వెంటనే టీ కాలనీ వేయించుకోవాలి. పెంపుడు జంతువులకు కూడా టీకాలను ఇప్పించాలి. అప్పుడు ఎటువంటి ప్రమాదం ఉండదు. టీకాలు వేయించకపోతే. ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు..

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి