Coronavirus : కొత్త రూపం దాల్చిన కరోనా లక్షణాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Coronavirus : కొత్త రూపం దాల్చిన కరోనా లక్షణాలు ఇవే…!

Coronavirus  : కొత్తగా కరోనా కేసులు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రమాద గంటను మోగిస్తున్నాయి. ఇప్పటికే కరోన ప్రపంచవ్యాప్తంగా తాండవం చేసింది. అనుకున్నటువంటి సమయంలో తాజాగా కరోనా మళ్ళీ కొత్త రూపం దాల్చిందని అనేకమంది దీని బారిన పడుతున్నారని మనదేశంలో కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయని వార్తలు మనం ప్రతినిత్యం చూస్తూ ఉన్నాము.. కొత్తగా కరోనా సంతరించుకున్న రూపం ఏంటి ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కొత్త కరుణా లక్షణాలు ఏంటి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.ఇది […]

 Authored By jyothi | The Telugu News | Updated on :31 December 2023,8:00 am

Coronavirus  : కొత్తగా కరోనా కేసులు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రమాద గంటను మోగిస్తున్నాయి. ఇప్పటికే కరోన ప్రపంచవ్యాప్తంగా తాండవం చేసింది. అనుకున్నటువంటి సమయంలో తాజాగా కరోనా మళ్ళీ కొత్త రూపం దాల్చిందని అనేకమంది దీని బారిన పడుతున్నారని మనదేశంలో కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయని వార్తలు మనం ప్రతినిత్యం చూస్తూ ఉన్నాము.. కొత్తగా కరోనా సంతరించుకున్న రూపం ఏంటి ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కొత్త కరుణా లక్షణాలు ఏంటి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.ఇది ప్రమాదకరవం మళ్లీ పాత రోజులు మొదలు కాబోతున్నాయి. అసలు ఏంటి తెలుసుకోబోతున్నాము..

పది పదిహేను రోజులుగా ఈ కొత్త తీవ్ర ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపిస్తుంది. మళ్ళీ కరోనా మరణాలను ఇది గుర్తుచేస్తుంది. అయితే ఈ JN1 వైరస్ ఏంటి.,? దాని లక్షణాలు ఏంటి.? ఇది ఎంతవరకు ప్రమాదకరం. మనదేశంలో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది. ఇప్పటికే రెండు మూడు విడతలుగా మనం తీసుకున్నటువంటి వ్యాక్సినేషన్ దీని భారీ నుంచి మనల్ని కాపాడుతుందా.. ఇలాంటి అనేక సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పటి కరోనా మిగిల్చినటువంటి చేదు జ్ఞాపకాలని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే ఇది ఎంత ప్రమాదం అనేది ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు కూడా ఒక అంచనాకి రాలేకపోతున్నారు. కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఉన్న వ్యక్తులకి అలాగే టీకాలు వేసిన వ్యక్తులకి కూడా ఇది సోకేలా చేస్తుంది. అంటే ఇప్పటికే మనం వ్యాక్సినేషన్ తీసుకున్న మళ్లీ ఈ కొత్త వైర స్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి.ఇంతకుముందు కరోణా మాదిరిగా ఇది ప్రభావం చూపిస్తుందని ఇంకా ఎక్కువ మందికి వస్తుందని కానీ ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లు కానీ ధ్రువీకరించలేదు.

అందుకు తగ్గ ఆధారాలు లేవు. అయితే వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. జ్వరంగా, చలిగాని, దగ్గు, తలనొప్పులు, శ్వాస ఆడకపోవటం, ముక్కు నుంచి నీళ్లు కారటం, గొంతు మంటగా ఉండటం, అలసటగా అనిపించడం, రుచి లేకపోవడం వాసన కోల్పోవడం, తిమ్మిర్లు పట్టడం, అతిసారం ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనికోసం చికిత్సగా హాస్పిటల్స్ లో నెంబర్ ఆఫ్ బెడ్స్ పెంచుతున్నారు. ఈ వేరియెంట్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి మనల్ని విపరీతమైనటువంటి భయాందోళనకు గురి చేసే లక్షణాలు ఏమీ ఉండవు.. కేసులు పెరిగితే టెస్ట్ లు చేయడానికి అఫీషియల్స్ ఉన్నారు. పండగల సీజన్ కూడా రాబోతుంది. క్రిస్మస్ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి ఈ పండగల సీజన్ లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు పెట్టుకోవాలి. అలాగే ప్రయా ణాలు వీలైతే తగ్గించండి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని భయభ్రాంతులకు గురి కాకుండా పబ్లిక్ గాథరించి కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది రాష్ట్రాన్ని అప్రమత్తంగా ఉండాలని సూచించింది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది