Diabetes : ఈ ఫ్రూట్స్‌తో కంట్రోల్‌లో షుగర్ లెవల్స్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : ఈ ఫ్రూట్స్‌తో కంట్రోల్‌లో షుగర్ లెవల్స్..

Diabetes : ఇండియాలో డయాబెటిస్ (మధుమేహం) డిసీజ్ బారిన పడే వ్యక్తుల సంఖ్య ఏటా బాగా పెరుగుతోంది. కాగా, మధుమేహ వ్యాధిగ్రస్తులు కంపల్సరీగా తమ ఫుడ్ హ్యాబిట్స్ పట్ల జాగ్రత్తలు వహించాలి. ఈ విషయమై చాలా మంది ఇవి తినాలి, అవి తొనద్దు అంటూ రకరకాల సలహాలు, సూచనలిస్తుంటారు. ఇంతకీ ఏం తినాలి, ఏం తొనద్దు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని పండ్లను డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :19 December 2021,10:21 pm

Diabetes : ఇండియాలో డయాబెటిస్ (మధుమేహం) డిసీజ్ బారిన పడే వ్యక్తుల సంఖ్య ఏటా బాగా పెరుగుతోంది. కాగా, మధుమేహ వ్యాధిగ్రస్తులు కంపల్సరీగా తమ ఫుడ్ హ్యాబిట్స్ పట్ల జాగ్రత్తలు వహించాలి. ఈ విషయమై చాలా మంది ఇవి తినాలి, అవి తొనద్దు అంటూ రకరకాల సలహాలు, సూచనలిస్తుంటారు. ఇంతకీ ఏం తినాలి, ఏం తొనద్దు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని పండ్లను డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చు. కానీ, జాగ్రత్తలు అవసరం. ఫ్రూట్స్‌లో ఉండేటువంటి

విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కంపల్సరీగా ప్రతీ ఒక్కరికి కావల్సినవే. ఇవి మనలను చార్జ్ చేయడంతో పాటు నూతన ఉత్తేజం కలిగేలా చేస్తాయి. బ్లడ్‌లోని షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిచుకోవచ్చు. ఇక ఫుడ్ పై శ్రద్ధ పెట్టినట్లయితే టైప్ 1, 2, ప్రి డయాబెటిస్ నుంచి కూడా బయటపడే చాన్సెస్ ఉన్నాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు.బ్లడ్‌లో ఉండే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమని ఈ సందర్భంగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఫ్రూట్స్‌ను బాగా నమిలి తినాలని వైద్యులు చెప్తున్నారు.

diabetes patients can eat these fruits

diabetes patients can eat these fruits

Diabetes : జాగ్రత్తలు మస్ట్..

పండును బాగా నమిలి తీసుకోవడం వలన అందులో ఉండేటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, పీచు పదార్థాలు డైరెక్ట్‌గా హ్యూమన్ బాడీలోకి వెళ్తాయి. ఫ్రూట్స్ తీసుకోవం వలన హ్యూమన్ బాడీలో ఉండే షుగర్ కరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇకపోతే మధుమేహ వ్యాధి గ్రస్తులు కంపల్సరీగా పియర్, యాపిల్, ద్రాక్ష, జామ, కివీ, నారింజ, దానిమ్మ పండ్లు తీసుకోవాలి. ఈ ఫ్రూట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా హెల్త్‌కు మేలు జరుగుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ద్వారా మనం ఏ ఫ్రూట్ తీసుకుంటే ఎంత షుగర్ లెవల్ పెరిగందనేది తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తక్కువ ఇండెక్స్ ఉండే ఫ్రూట్‌ను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది