Urad Dal : మినప్పప్పు తినే వాళ్ళు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…!

Authored By aruna | The Telugu News | Published on: February 13, 2024, 11:00 am
  •  Urad Dal : మినప్పప్పు తినే వాళ్ళు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి...!

Urad Dal  : ప్రస్తుతం ఉన్న బిజీ బిజీ లైఫ్ లో అసలు హెల్త్ గురించి పట్టించుకునే తీరిక లేక ఏదో హడావిడిగా బయట దొరికే పుడ్ తో అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. దాంతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డబ్బు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మినప్పప్పు తినాలా.. వద్దా.. చూద్దాం.. మినప్పప్పును కాయ ధాన్యాల్లో ఒకటిగా చెబుతారు. మినప్పప్పు లో ప్రోటీన్ ఎక్కువ అలాగే కార్బోహైడ్రేట్స్ విటమిన్ బిసి ఐరన్, పోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి.

అందువల్ల ఇవి గుండెకు నరాల వ్యవస్థకు మేలు చేస్తాయి. నల్లటి తొక్క ఉండే మినప్పప్పు చలవ చేస్తుంది. ఆయుర్వేదంలో తలనొప్పి తగ్గడానికి జ్వరం వేడి తగ్గడానికి పక్షవాతం తగ్గడానికి కీళ్ల నొప్పులు, అల్సర్లు తగ్గడానికి కూడా వాడుతారు అయితే ఇవే గింజలు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ప్రమాదం కూడా.. మినప్పప్పు ఎక్కువగా తింటే రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. ఫలితంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. అందువల్ల ఆల్రెడీ కిడ్నీలో రాళ్లు ఉన్నవారు మినప్పప్పు వాడకపోవడమే మేలు. ట్యూమర్ సమస్యలు ఉన్నవారు కూడా మినప్పప్పు తినకూడదు. కీళ్ల వాపులు ఎక్కువగా ఉన్నవారు కూడా ఈ గింజలకు దూరంగా ఉండాలి. ఈ సమస్య ఉన్నవారు మినప్పప్పు ఎక్కువ తింటే ఆ కీళ్ల నొప్పులు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది.

అంతేకాదు మినప్పప్పు ఎక్కువగా తింటే గాల్బ్లాడర్లో కూడా రాళ్లు ఏర్పడతాయి. అందుకు సంబంధించిన మందులు వాడేవారు మినప్పప్పు తినకపోవడమే మేలు. వీటితోపాటు చెవి నొప్పి ఎక్కువగా ఉన్నవారు కూడా మినప్పప్పుకు దూరంగా ఉండటం మంచిది. చెవి నొప్పి ఉన్నవారు ఎక్కువ మోతాదులో తీసుకుంటే చెవుడు వచ్చే అవకాశం ఉందట. అలాగే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. అందువల్ల పొట్టలో గ్యాస్ మలబద్ధకం ఉన్నవారు మినప్పప్పు తీసుకోవడానికి ముందు డాక్టర్ సలహాలను పాటించటమే మేలు…

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp