nellore: తెలంగాణ వాళ్లు మ‌న‌ల్ని దోపిడీ చేస్తున్నారు : స‌జ్జ‌ల‌ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

nellore: తెలంగాణ వాళ్లు మ‌న‌ల్ని దోపిడీ చేస్తున్నారు : స‌జ్జ‌ల‌

nellore: నెల్లూరు: మ‌న‌కు రావాల్సిన నీటిని మ‌న‌కు రానివ్వ‌కుండా తెలంగాణ మోసం చేస్తుంద‌ని ప్రభుత్వ స‌ల‌హారులు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆరోపించారు. నెల్లూరు ఆర్అండ్‌బి అతిథి గృహంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, ఇరిగేష‌న్ శాఖ మంత్రి పి. అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో టిడిపి హ‌యాంలో తెలంగాణ‌లో టిడిపి ప‌లు అక్ర‌మ క‌ట్ట‌డాలు ప్రారంభించిన విష‌యాన్ని గుర్తు చేశారు. నాడు టిడిపి హ‌యాంలో ఉన్న‌ప్పుడు ఏపీని […]

 Authored By saidulu | The Telugu News | Updated on :3 August 2021,12:50 pm

nellore: నెల్లూరు: మ‌న‌కు రావాల్సిన నీటిని మ‌న‌కు రానివ్వ‌కుండా తెలంగాణ మోసం చేస్తుంద‌ని ప్రభుత్వ స‌ల‌హారులు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆరోపించారు. నెల్లూరు ఆర్అండ్‌బి అతిథి గృహంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, ఇరిగేష‌న్ శాఖ మంత్రి పి. అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో టిడిపి హ‌యాంలో తెలంగాణ‌లో టిడిపి ప‌లు అక్ర‌మ క‌ట్ట‌డాలు ప్రారంభించిన విష‌యాన్ని గుర్తు చేశారు.

sajjala

sajjala

నాడు టిడిపి హ‌యాంలో ఉన్న‌ప్పుడు ఏపీని ప‌ట్టించుకోకుండా ఉండ‌టం వ‌ల్లే ఇప్పుడు ఆంధ్ర ప్ర‌దేశ్‌కు ఈ దుస్థితి దాపురించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏపీ రైతుల శ్రేయ‌స్సుకు సిఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలంగాణ నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్‌కు నీళ్లు తెప్పించ‌డానిక ప్ర‌య‌త్నిస్తుంటే…

తెలంగాణ ప్ర‌భుత్వం నీటిని తోడేస్తున్నార‌ని మండిప‌డ్డారు. సిఎం జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన హౌసింగ్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నార‌న్నారు. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రి ఇంటికి నీటిని అందిస్తామ‌ని స‌జ్జ‌ల హామీ ఇచ్చారు.

saidulu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది