
ys jagan sketch for second time victory
Ys Jagan : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో బలమైన ప్రతిపక్ష నేతగా ప్రజల తరఫున నిలబడటానికి, రెండో ప్రయత్నంలో అధికారంలోకి రావటానికి ముఖ్య కారణం ఆయన నిత్యం ప్రజల్లో ఉండటమే. రోజూ తమ కోసం పోరాడుతున్న నాయకుడికి ఒకసారి ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇస్తే పోలా అని పబ్లిక్ అనుకున్నారు. అధికారం చేతికి రావటమే తరువాయి సరికొత్త పాలనను ప్రజలకు అందిస్తున్నారు. ఈ క్రమంలో రెండేళ్లు గిర్రున తిరిగొచ్చాయి. కానీ ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చింది తక్కు
ys jagan sketch for second time victory
వనే చెప్పాలి. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్స్ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ Ys Jagan ఎక్కువ శాతం తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు ఆఫీసుకే పరిమితమవుతున్నారు. డెవలప్మెంట్ కార్యక్రమాల ప్రారంభోత్సవాలైనా, అధికారులతో సమీక్షలైనా, నిధుల విడుదలైనా అన్నీ ఆన్ లైన్ లోనే చేసేస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి Ys Jagan తరచూ ప్రజల్లోకి వస్తుంటే వాళ్ల సాధక బాధకాలు కొన్నైనా ప్రత్యక్షంగా తెలుస్తాయి. జిల్లాల పర్యటనలకు వెళితే ఆ కొన్ని చోట్లయినా అధికారులు హడావుడితో పనులు చేయిస్తారు. తద్వారా ప్రజలకు కొన్ని సమస్యలైనా తీరతాయి. ఆఫీసర్లు కూడా లైట్ తీసుకునే ఛాన్స్ ఉండదు. ఆన్ లైన్ లో ఫండ్స్ రిలీజ్ చేసినంత మాత్రాన క్షేత్ర స్థాయిలో అన్నీ చక్కబడవు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడితేనే సరిపోదు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. సీఎం వైఎస్ జగన్ కి కూడా పబ్లిక్ లోకి రావాలని ఉంది కానీ కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల సాధ్యపడట్లేదు. అందరికీ వ్యాక్సిన్ వేసిన తర్వాతే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన పెట్టుకోనున్నారు.
రచ్చబండ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిఊరికీ వచ్చి అక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించాలనే ఆలోచనతో ఉన్నారు. కనీసం కొత్త సంవత్సరంలోనైనా ఈ పక్కా ప్లాన్ అమలవుతుందని ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు అప్పటికింకా రెండున్నర సంవత్సరాల కాలం అందుబాటులో ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ ని చూసిన జనం ముఖ్యమంత్రి హోదాలో ఇంకా ప్రత్యక్షంగా చూడలేదు. అప్పటికీ ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హావభావాల్లో, మాటల్లో చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకుంటాయని అనుకుంటున్నారు.
SL vs NZ T20 World Cup 2026 ICC T20 ప్రపంచ కప్ 2026 ICC T20 World…
Dhurandhar Telugu : టాలీవుడ్లో Tollywood ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.…
AP Politics : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం పెను…
Boduppal Circle : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్లో రోడ్ల దుస్థితిపై వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణమే…
Tirumala Tirupati Laddu : కలియుగ వైకుంఠం తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా…
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.…
Allu Sneha Reddy : అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు…
Modi : తమిళనాడు Tamil Nadu దివంగత సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జయలలితపై ప్రధాని నరేంద్ర మోడీ Modi ప్రసంశల…
PM Kisan : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వివరాల…
Hyderabad: తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…
YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. మొన్నటి…
Pension : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త తెలియజేసింది. మార్చి 1, 2026 ఆదివారం…
This website uses cookies.