Nagarjuna : కుటుంబ కోసం దానికి రెడీ అంటున్న నాగార్జున.. వివాదం ముదురిపోతుందే..!
అక్కినేని ఫ్యామిలీ పరువు మొత్తాన్ని బజారుకి ఈడ్చేంత పనిచేశారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. కే టీ ఆర్ ను టార్గెట్ చేస్తూ ఆమె అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన విషయాలను ప్రస్తావించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ఆగాలంటే సమంతని తన దగ్గరకు పంపించాలని కే టీ ఆర్ అడిగాడని దానికి నాగార్జున, నాగ చైతన్య సరే అన్నా సమంత ఒప్పుకోకపోవడం వల్లే వారిద్దరు విడిపోయారని కొండా సురేఖ వ్యాఖ్యలు చేసింది.రాజకీయాలకు అసలు ఏమాత్రం సంబంధం […]
ప్రధానాంశాలు:
Nagarjuna : కుటుంబ కోసం దానికి రెడీ అంటున్న నాగార్జున.. వివాదం ముదురిపోతుందే..!
అక్కినేని ఫ్యామిలీ పరువు మొత్తాన్ని బజారుకి ఈడ్చేంత పనిచేశారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. కే టీ ఆర్ ను టార్గెట్ చేస్తూ ఆమె అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన విషయాలను ప్రస్తావించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ఆగాలంటే సమంతని తన దగ్గరకు పంపించాలని కే టీ ఆర్ అడిగాడని దానికి నాగార్జున, నాగ చైతన్య సరే అన్నా సమంత ఒప్పుకోకపోవడం వల్లే వారిద్దరు విడిపోయారని కొండా సురేఖ వ్యాఖ్యలు చేసింది.రాజకీయాలకు అసలు ఏమాత్రం సంబంధం లేని ఈ ఇష్యూలో సమంతని, అక్కినేని ఫ్యామిలీని తీసుకు రావడం తో కొండా సురేఖ మీద ఇండస్ట్రీ వ్యక్తులంతా కూడా ఫైర్ అయ్యారు. ఐతే ఆమె ప్రెస్ మీట్ పెట్టి తన ఉద్దేశం అది కాదని.. అనుకోకుండా అలాంటి వ్యాఖ్యలు చేశానని అన్నది.
Nagarjuna నాగార్జున లీగల్ గా ప్రొసీడ్..
ఐతే సరేలే వెనక్కి తగ్గింది కదా అనుకోగా మళ్లీ వాళ్లిద్దరు ఎందుకు విడిపోయారో కారణాలు చెప్పాలి. అందరు కే టీ ఆర్ వల్లే అంటూ మరోసారి కొండా సురేఖా కామెంట్ చేసింది. ఈ ఇష్యూపై ఇప్పటికే నాగార్జున లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు. కొండా సురేఖ మీద పరువు నష్టం దావా వేశారు. ఐతే తన ఫ్యామిలీ మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ సినీ పరిశ్రమ స్పందనకు నాగార్జున థాంక్స్ చెప్పారు. ఇది నాన్న గారి ఆశీర్వాదమని అన్నారు.
ఐతే నా కుటుంబానికి అండగా నిలిచేందుకు నేను సిం హాన్ని అవుతానని ఆయన తెలిపారు. నాగార్జున ఈ ఇష్యూని అంత తేలికగా తీసుకోకూడదని ఫిక్స్ అయ్యారు. సినీ పరిశ్రమ వ్యక్తుల మీద ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని పరిశ్రమ వ్యక్తులు చెబుతున్నారు. ఐతే ఈ గొడవ ఎక్కడ దాకా దారి తీస్తుంది అన్నది తెలియట్లేదు.