Nalgonda..డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Nalgonda..డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మట్టి గణపతులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా నిషేధించాలని కోరారు. ఈ విగ్రహాల వల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని వివరించారు. మట్టి గణేశ్ ప్రతిమలను పూజించడం ప్రతీ ఒక్కరు అలవాటు చేసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. పర్యావరణ పరిస్థితులు సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. […]

 Authored By praveen | The Telugu News | Updated on :10 September 2021,9:55 pm

జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మట్టి గణపతులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా నిషేధించాలని కోరారు. ఈ విగ్రహాల వల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని వివరించారు. మట్టి గణేశ్ ప్రతిమలను పూజించడం ప్రతీ ఒక్కరు అలవాటు చేసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. పర్యావరణ పరిస్థితులు సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇప్పటికే రోజురోజుకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం, మితిమీరిన కాలుష్యం, రసాయనాల వాడకం వల్ల ఎన్విరాన్‌మెంట్ కలుషితమవుతున్నదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీనివాసాచారి, పట్టణ కార్యదర్శి నరేష్, నేతలు రాము, యాదగిరి పాల్గొన్నారు. ఇకపోతే పలు ఎన్జీవో సంస్థలు, సామాజిక కార్యకర్తలు ప్రజలకు ఉచితంగా రాష్ట్రవ్యాప్తంగా మట్టి గణేశ్ ప్రతిమలను పంపిణీ చేస్తున్నాయి. జనంలోనూ గతంతో పోల్చితే కొంత అవేర్‌నెస్ పెరిగింది. చాలా మంది మట్టి గణేశులను ప్రతిష్టించేందుకు మొగ్గు చూపుతున్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది