Prakaasham..15 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్

 Authored By praveen | The Telugu News | Updated on :13 September 2021,4:09 pm

ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ నెల 15 నుంచి 23 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ రామచంద్రారెడ్డి సోమవారం తెలిపారు. ఫస్టియర్ ఎగ్జామ్స్ మార్నింగ్ 9 గంటల నుంచి ఆఫ్టర్‌నూన్ 12 గంటల వరకు ఉంటాయని, సెకండియర్ ఎగ్జామ్స్ ఆఫ్టర్‌నూన్ 2.30 గంటల నుంచి ఈవినింగ్ 5.30 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. 27న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 28న ఎన్విరాన్‌మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయని, అక్టోబర్ 1న ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పారు.

ఇకపోతే కొవిడ్ వల్ల ఇంటర్ మాత్రమే కాకుండా అన్ని రకాల ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. దాదాపుగా ఒక అకడమిక్ ఇయర్ ఖాళీగానే గడిచిపోయింది. పిల్లలు అందరూ ఇళ్లలోనే కాలం గడిపేశారు. అయితే, ప్రైవేటు స్కూల్స్ ఆన్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేసినప్పటికీ అందరూ క్లాసెస్ వినే సిచ్యువేషన్స్ అయితే లేవు. ఆర్థిక కారణాలరిత్యా కొందరు పిల్లలు ఆన్ లైన్ క్లాసెస్ వినలేకపోతున్నారు. ఇక చాలా కాలం తర్వాత ఇటీవలే స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయిన సంగతి అందరికీ విదితమే.

 

 

praveen

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి